చంద్రబాబు కోసం దివ్యాంగుల దీక్ష
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో మంగళవారం ఆందోళనలు కొనసాగాయి.
హైదరాబాద్లో కొనసాగుతున్న ఆందోళనలు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, బృందం: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో మంగళవారం ఆందోళనలు కొనసాగాయి. నిరసన దీక్షలతో తెదేపా కార్యకర్తలు, అభిమానులు బాబు అక్రమ అరెస్టును ఖండించారు. హైదరాబాద్ దోమలగూడలోని తెదేపా నగర కార్యాలయం ఎదుట దివ్యాంగులు నిరసన దీక్ష చేపట్టారు. తొలుత ‘నేను సైతం’ అంటూ బాబుకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. తెదేపా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా విద్య, ఉపాధి రంగాల్లో ప్రాధాన్యమిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని బోరబండ తెదేపా అధ్యక్షుడు జి.అరుణ్రాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు గణేశునికి పూజలు చేశారు. షాద్నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మౌన దీక్ష చేపట్టారు. తెతెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీజీకే మూర్తి ఆధ్వర్యంలో పలువురు నేతలు రాజమహేంద్రవరంలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు.
తెలంగాణ.. మీ సొంత రాజ్యమా?
-కాసాని
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసన ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దని, ఆంధ్రాలోనే చేసుకోవాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం గర్హనీయమని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఇక్కడ నిరసన చేయొద్దని కేటీఆర్ ఫత్వా జారీ చేయడానికి తెలంగాణ ఏమైనా ప్రత్యేక దేశమా? లేకపోతే కేటీఆర్ రాజ్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను అరెస్టు చేస్తే ఖండించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. వారి కుటుంబానికి రాజకీయ ఉన్నతిని కల్పించిన చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించకముందే మహారాష్ట్ర, ఏపీ తదితర రాష్ట్రాల్లో భారాస ఎందుకు సభలు నిర్వహిస్తోందో సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వ దుశ్చర్యను ఖండిస్తూ.. చంద్రబాబుకు మద్దతుగా తెదేపాశ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా.. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేటీఆర్కు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని.. క్షమాపణ చెప్పాలని కాసాని డిమాండ్ చేశారు.
ఏపీలో భారాస రాజకీయాలు చేయడం లేదా?
-నన్నూరి నర్సిరెడ్డి
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతుంటే కేటీఆర్ భరించలేకపోతున్నారని తెదేపా జాతీయ అధికారి ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో డేటా చోరీ జరిగిందన్న ఆరోపణలపై మీకేం సంబంధం ఉందని హైదరాబాద్లో గతంలో కేసులు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. తెరాసను భారాసగా మార్చి ఏపీలో రాష్ట్ర కమిటీని ఏర్పాటుచేసి రాజకీయాలు చేయడం లేదా? అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమన్వయం పెంచుకుందాం
కూటమిలోని పార్టీల మధ్య సమన్వయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతలు నిర్ణయించారు. -
గోమూత్ర వ్యాఖ్యలకు లోక్సభలో ఎంపీ క్షమాపణ
తాను చేసిన గోమూత్ర వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ బుధవారం లోక్సభలో క్షమాపణలు చెప్పారు. -
చంద్రబాబుతో పవన్ భేటీ
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. -
పోలిపల్లిలో యువగళం ముగింపు సభ!
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 17న నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
దోచుకోవడంపై ఉన్నశ్రద్ధ.. రైతుల్ని ఆదుకోవడంలో లేదా?
నదీగర్భాల్ని తొలిచి మరీ ఇసుక దోచుకోవడంపై సీఎం జగన్ చూపిస్తున్న శ్రద్ధలో కొంచెమైనా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని, సర్వస్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవడంలో లేదని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. -
రూ.1,233 కోట్ల కేటాయింపులు ఎవరికి దోచిపెట్టడానికి?
‘తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించలేరు.. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం పెట్టలేరు కానీ.. భూమన కరుణాకర్రెడ్డి తితిదే బోర్డు ఛైర్మన్ అయిన మూడు నెలల్లో బడ్జెట్లో చూపకుండా వివిధ కాంట్రాక్టుల కింద రూ.1,233 కోట్లు కేటాయిస్తారా? -
మంచినీళ్లు కూడా ఇవ్వరా?
మిగ్జాం తుపానును ఎదుర్కోవడం, బాధితుల్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
రైతాంగాన్ని ఆదుకోవాలి
తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. -
సీఎం బయటికి రారేం?
మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం జగన్ ఒక చిన్న సందేశమిచ్చి ఇంట్లో కూర్చోవడం చూస్తే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
ఏపీ అప్పు రూ.11.28 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు దొరకకుండా ఉండటానికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.11.28 లక్షల కోట్లకు చేరాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. -
అంచనాలకు మించి తుపాను నష్టం
తుపాను నష్టం అంచనాలకు మించి ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. -
రేవంత్ అంచెలంచెలుగా ఎదిగారు
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.