బాబు అరెస్ట్.. జగన్ శాడిజానికి నిదర్శనం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం.. సీఎం జగన్ శాడిజానికి నిదర్శనమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయవాడ (గాంధీనగర్), న్యూస్టుడే: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం.. సీఎం జగన్ శాడిజానికి నిదర్శనమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. జగన్ పతనం తప్పదని హెచ్చరించారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్క్లబ్లో విలేకర్లతో మాట్లాడారు. ఈ కేసులో సీమెన్స్ మాజీ ఎండీతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో పెట్టి, చంద్రబాబుపై ఆరోపణలు చేయాలని వారిని హింసించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పీకల్లోతు అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జగన్.. తనలా చంద్రబాబు చేసిన ప్రతి పనిలోనూ అవినీతి ఉందని భావించడం మూర్ఖత్వమన్నారు. ఏపీఎస్డీసీ కార్పొరేషన్లో కార్యదర్శిగా పని చేసిన ప్రేమచంద్రారెడ్డి పేరులో చివరి రెండక్షరాలను చూసే ఆయనపై కేసు పెట్టలేదని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 2.40 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని, వారిలో 72 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం వాటా సమకూర్చిన ఈ ప్రాజెక్టులో రూ.279 కోట్లు అవినీతి జరిగిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 18 నెలలకు ఏ విధంగా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
మంత్రి బొత్సకు మతిభ్రమించింది: రిమాండ్ నివేదికలో చేసిన ఆరోపణలు చూస్తుంటే.. ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వడ్డే అన్నారు. సీఐడీ అధికారి సంజయ్ విజయవాడలోని సిద్ధార్థ కళాశాల, ఇడుపులపాయలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను చూడాలని హితవు పలికారు. మంత్రి బొత్సకు పిచ్చిపట్టడం వల్లే.. అసలు సీమెన్స్తో ఒప్పందమే లేదు, శిక్షణే లేదని చెబుతున్నారని, ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్దోషిగా బయటికి వస్తారని అన్నారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నరేంద్ర పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్తో జగన్ దోస్తీ ఆస్తులు కాపాడుకోవడానికేనా?
తెలంగాణలో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికే సీఎం జగన్ కేసీఆర్తో దోస్తీ చేస్తున్నారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. -
తెదేపాతో పొత్తుపై నోరు జారితే సహించను
‘జనసేన తెదేపా పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైకాపా కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. -
ప్రజల్లోకి ఎప్పుడు, ఎలా వస్తానో త్వరలో చెబుతా
-
కోడికత్తిలా నాగార్జునసాగర్ డ్రామా
ఎప్పుడూ లేని కరవు రాష్ట్రాన్ని వెంటాడుతోందని, రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్లో హాయిగా ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
పదేళ్లలో 50% మహిళా సీఎంలే
కాంగ్రెస్ సంస్థాగత పదవుల్లో మహిళల పాత్రను గణనీయంగా పెంచేందుకు క్రియాశీలంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
కొప్పుల ఈశ్వర్పై ఎన్నికల పిటిషన్ కొట్టివేత
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. -
స్వప్రయోజనాలకే కృష్ణా జలాల తాకట్టు
తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి, బాబాయ్ హత్య కేసు నుంచి అవినాష్రెడ్డిని కాపాడటానికి.. కృష్ణా జలాల్ని పక్క రాష్ట్రానికి సీఎం జగన్ ధారాదత్తం చేశారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
బినామీలకు ఎసైన్డ్ భూములు కట్టబెట్టే కుట్ర
గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల ఎసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదుచేయించి, ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు భారాస నేతలు కసరత్తు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. -
‘యువగళం’.. వైకాపా పతనానికి నాంది
తెదేపా అధినేత చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవలంబించిన వైఖరే ఆ రాష్ట్రంలో భారాస పార్టీ గడ్డు పరిస్థితికి కారణమని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జి.చిన్నయ్య దొర విమర్శించారు. -
జల వివాదం కేసీఆర్, జగన్ల ఎత్తుగడ: కోదండరాం
ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఓటు హక్కు ద్వారా ప్రజలు తిరుగుబాటు చేశారని, ఆ మేరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
రాష్ట్రంలో జగన్ పీనల్ కోడ్
రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో జగన్ పీనల్ కోడ్ అమలవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
10 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు!
తెదేపా అధినేత చంద్రబాబు త్వరలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!