‘ఈ ఎమ్మెల్యే మాకొద్దు’
పార్టీని తొలి నుంచి నమ్ముకుని, పార్టీ విజయానికి కష్టపడి గెలిపించిన నాయకులు, కార్యకర్తలను అణగదొక్కుతున్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమకు వద్దని సింగిల్ విండో ఛైర్మన్, వైకాపా మండల మాజీ కన్వీనరు హరిశ్చంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
పిచ్చాటూరు, న్యూస్టుడే: పార్టీని తొలి నుంచి నమ్ముకుని, పార్టీ విజయానికి కష్టపడి గెలిపించిన నాయకులు, కార్యకర్తలను అణగదొక్కుతున్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమకు వద్దని సింగిల్ విండో ఛైర్మన్, వైకాపా మండల మాజీ కన్వీనరు హరిశ్చంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏకపక్ష తీరుపై నిరసనగా బుధవారం పిచ్చాటూరు బస్టాండు వద్ద అసమ్మతి వర్గీయులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కారణమైన పార్టీ ద్రోహులకు పదవులు కట్టబెట్టడం అన్యాయమన్నారు. తెదేపా నుంచి వలస వచ్చిన నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని అధిష్ఠానానికి విన్నవించారు. అనంతరం వైఎస్ఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేశారు. ఎంపీటీసీలు వేలు, తామరసెల్వి, సర్పంచులు రోస్రెడ్డి, సతీష్, భూపతి, రాజా, అయ్యప్పన్, సీనియర్ నాయకులు ప్రతాప్రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు
తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయిస్తున్నారు. -
Kishan Reddy: లోపాయికారి ఒప్పందం ప్రకారమే మజ్లిస్ ప్రొటెం స్పీకర్: కిషన్రెడ్డి
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. -
Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్ను కట్ చేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్ (Congress) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
KCR: భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
భారాస (BRS) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)ను ఎన్నుకున్నారు. -
TS News: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు
రాష్ట్ర మంత్రులకు శాఖలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేటాయించారు. -
Kishan Reddy: భాజపా ఎమ్మెల్యేలతో కిషన్రెడ్డి భేటీ
నూతనంగా ఎన్నికైన భాజపా శాసనసభ్యులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను కిషన్రెడ్డి సన్మానించారు. -
Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం
ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ తమిళిసై.. అక్బరుద్దీన్ (Akbar Uddin Owaisi)తో ప్రమాణం చేయించారు. -
రోడ్డు దిగని జగన్.. పొలం గట్టున బాబు
తుపానుకు దెబ్బతిన్న పంటల పరిశీలన సందర్భమది.. శుక్రవారం పట్టపగలు సీఎం వైఎస్ జగన్ వచ్చారు. చుట్టూ బారికేడ్లు, పొలం పక్కనున్న రోడ్డు మీద ఎత్తయిన వేదిక.. ఎండ పడకుండా టెంట్లు.. కనీసం రోడ్డు దిగకుండా అక్కడి నుంచే ‘పంట నష్టాన్ని’ పరిశీలించి వెళ్లారు. అదే ప్రాంతానికి అదేరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేరుకున్నారు. -
నేటి నుంచి లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం
తుపాను కారణంగా తాత్కాలికంగా ఆగిన యువగళం పాదయాత్ర శనివారం మళ్లీ ప్రారంభం కానుంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ఈ యాత్ర ఈ నెల 3న కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం శీలంవారిపాకల ప్రాంతం వద్దకు చేరుకుంది. -
ప్రభుత్వ ఉదాసీనతతో అన్నదాతకు తీవ్రనష్టం
తుపానుపై వైకాపా ప్రభుత్వ ఉదాసీనత వల్లే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల, ఉంగుటూరు మండలం కైకరం, తల్లాపురం గ్రామాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. -
సమన్వయంతో పని చేస్తే అధికారంలోకి..
తెదేపాతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాల్సిన సమయమిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మూడు నెలల్లో ఫలితం అనుభవిస్తారు
ప్రజాసమస్యల్ని గాలికొదిలేసి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ విర్రవీగితే... ఫలితం అనుభవించక తప్పదని జగన్ ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటేశాం. -
భయస్థులకు ఎన్నికల్లో పోటీ ఎందుకు?
భయం భయంగా బతుకుతున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా.. అని సీఎం జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజలకు కనపడని వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా.. అని నిలదీశారు. -
ఎన్నికలకు ముందు గ్రూప్-2 ప్రకటన వంచన కాదా?: తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల్ని వంచించడమేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు గట్టి షాక్ తగిలింది. డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో ఆమెపై లోక్సభ శుక్రవారం బహిష్కరణ వేటు వేసింది. -
తిరుపతికి ‘బ్యాండ్’ వేశారు!
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు. -
మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణం
మిజోరంశాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ (జెడ్పీఎం) అధ్యక్షుడు లాల్దుహోమా శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఓటమి అనూహ్యం: కాంగ్రెస్
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా చేతిలో ఓటమి అనూహ్యమని, ఆ ఫలితాలు తమను తీవ్రంగా నిరాశపరిచాయని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. -
‘మేడిగడ్డ’ అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కోరారు. -
కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు పోరాడతాం
అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 8 స్థానాలు, 14 శాతం ఓట్లతో పాటు 19 స్థానాల్లో ద్వితీయ స్థానంలో నిలిచిందని, ప్రతిపక్ష పార్టీగా బాధ్యతను నెరవేరుస్తుందని మధ్యప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జి పి.మురళీధర్రావు తెలిపారు. -
మధ్యప్రదేశ్ భాజపా శాసనసభాపక్ష నేత ఎంపిక పరిశీలకునిగా డాక్టర్ లక్ష్మణ్
మధ్యప్రదేశ్ భాజపా శాసనసభాపక్ష నేత ఎంపికకు పరిశీలకునిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నియమితులయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
NIA: 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు.. ఐసిస్ కుట్ర కేసులో 13 మంది అరెస్టు
-
Telangana Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు
-
Kishan Reddy: లోపాయికారి ఒప్పందం ప్రకారమే మజ్లిస్ ప్రొటెం స్పీకర్: కిషన్రెడ్డి
-
గాజాపై ఐరాస భద్రతా మండలి తీర్మానం .. వీటో పవర్ వాడిన అమెరికా
-
Kapil Sibal: అస్సాం అప్పుడు మయన్మార్లో భాగమే: కపిల్ సిబల్ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన హిమంత
-
Gautham Gambhir: మా ఆటగాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే : గంభీర్