YSRCP: ‘టికెట్లు’ చిరిగాయ్..!
‘175కి 175 స్థానాల్లో గెలుపు సాధ్యమే. క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు చాలా బాగా ఉన్నాయి’ ఇవి ముఖ్యమంత్రి జగన్ నాలుగు రోజుల కిందట వైకాపా ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.
వైకాపాకు అంతా సానుకూలమే అంటున్న జగన్
కానీ పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని తేల్చేసిన సీఎం
ముగ్గురు, నలుగురు మంత్రులకూ అవకాశం లేనట్లే
ఈనాడు - అమరావతి
‘175కి 175 స్థానాల్లో గెలుపు సాధ్యమే. క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు చాలా బాగా ఉన్నాయి’ ఇవి ముఖ్యమంత్రి జగన్ నాలుగు రోజుల కిందట వైకాపా ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. అదే సమయంలో ఎమ్మెల్యేల్లో కొంతమందికి ఈసారి టికెట్లు ఇవ్వలేకపోవచ్చనీ చెప్పారు. క్షేత్రస్థాయిలో అంత సానుకూలత ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు టికెట్లు ఎందుకు ఇవ్వనంటున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఉండదని, కొందరిని ఎంపీలుగా బరిలోకి దింపనున్నట్లు సీఎం ఇప్పటికే చెప్పారని తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగి, ఉన్నతస్థాయిని అనుభవించి ప్రస్తుతం మంత్రిమండలిలోనూ ఉన్న ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వారిని ఎంపీలుగా పంపేందుకు సీఎం సిద్ధమయ్యారు. వీరితోపాటు మరో ఇద్దరు మంత్రులను కూడా లోక్సభకు పోటీ చేయించనున్నారంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు ఈసారి అసలు టికెట్లు ఉండవని సీఎం తేల్చి చెప్పినట్లు తెలిసింది. వీరిలో ఎస్సీ ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..
2026లో రాజ్యసభకు పంపుతా
ఒక సీనియర్ మంత్రి తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని, ఎమ్మెల్యే టికెట్ను తన కుమారుడికి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. అయితే ఇప్పుడు సాధ్యం కాదని సీఎం చెప్పారని తెలిసింది. ‘ప్రస్తుతానికి మీరే పోటీ చేయండి. 2026లో మిమ్మల్ని రాజ్యసభకు పంపుతా. అప్పుడు ఖాళీ అయ్యే మీ ఎమ్మెల్యే స్థానంలో మీ అబ్బాయితో పోటీ చేయిద్దాం’ అని సీఎం ఆ మంత్రికి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అదే జిల్లాకు చెందిన ఎంపీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతమూ రాలేదంటున్నారు. వీరి పక్క జిల్లాలోని మరో సీనియర్ మంత్రిని ఈసారి ఎంపీగా పోటీ చేయాలని సీఎం సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అదే ఎంపీ స్థానంలో ఈ మంత్రిని లేదా శాసనసభ సభాపతిని బరిలోకి దింపేందుకు సీఎం నిర్ణయించినట్లు వైకాపాలో చర్చ జరుగుతోంది. శాసనసభాపతి కూడా ఈసారి తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు సీఎంను కోరారు. ఆ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరో జిల్లాలో ప్రస్తుత మంత్రిని ఎంపీగా, ఇప్పుడున్న ఎంపీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపే అవకాశం ఉందన్న చర్చ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీని, మరో ఎమ్మెల్యే స్థానంలో ఎంపీని పోటీకి దించే అవకాశం ఉందంటున్నారు.
ఆ మంత్రులు.. లోక్సభ స్థానాల్లో పోటీ
ముగ్గురు లేదా నలుగురు మంత్రులను ఈసారి ఎంపీలుగా పోటీ చేయించేందుకు సీఎం రంగం సిద్ధం చేశారు. అదే విషయాన్ని ఆ మంత్రులకు సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇక్బాల్ను కదిరికి..
కదిరిలో ఈసారి ముస్లిం అభ్యర్థిని పోటీ చేయించేందుకు సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ను కదిరి వెళ్లాల్సిందిగా ఆయన సూచించారు. 2019లో హిందూపురంలో పోటీ చేసి ఓడిపోయి, తర్వాత అక్కడ పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తున్న ఇక్బాల్ను ఇటీవల ఆ పదవి నుంచి తప్పించి దీపికకు ఆ బాధ్యతను అప్పగించారు. తనను హిందూపురం నుంచి తప్పించడంపై కినుక వహించిన ఇక్బాల్ కదిరికి వెళ్లాలన్న సీఎం ప్రతిపాదనపై తన సమ్మతిని తెలియజేయలేదు.
ఇన్ఛార్జులకూ అనుమానమే
అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలుగా ప్రస్తుతం కొనసాగుతున్నవారిలో కొందరికి టికెట్లు ఉండకపోవచ్చు. ఇప్పటికే విశాఖ తూర్పు బాధ్యతను విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇచ్చేశారు. రాజమహేంద్రవరం నగరంలో సమన్వయకర్త శ్రీనివాస్ బదులుగా ఎంపీ మార్గాని భరత్ను బరిలో దింపాలనేది సీఎం యోచనగా చెబుతున్నారు. భరత్ మళ్లీ ఎంపీగానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థి ఆయనే అని ఖరారైనట్లే అనే పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. అయితే ప్రస్తుత ఎంపీ ఒకరిని ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుందనేదానిపై సీఎం సర్వే చేయించడం కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో ప్రస్తుత సమన్వయకర్తలు బాచిన కృష్ణచైతన్య, వరికూటి అశోక్బాబులను మార్చాలంటూ ధర్నాలు జరిగాయి. వీరిలో ఒకరికి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మరొకరికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు ఉంది.
వీరికి టికెట్లు లేనట్లే..!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, అనంతపురం, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఉండదని ముఖ్యమంత్రి ఇప్పటికే స్వయంగా చెప్పినట్లు తెలిసింది. ఏలూరు ఎంపీ ఈసారి పోటీ చేయరని, పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పనిచేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఆయన బరిలో ఉండకపోతే ఆ స్థానంలో జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి (ప్రస్తుత ఎమ్మెల్యే)ను బరిలోకి దింపేందుకు సీఎం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలోనూ ఒక సీనియర్ ఎమ్మెల్యేను ఈసారి లోక్సభ బరిలో దింపనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Lok Sabha: మరో ఇద్దరు భాజపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భాజపా ఎంపీలు తమ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. -
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) నేడు ‘ప్రజాదర్బార్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజా దర్బార్ జరిగిన తీరుపై సీఎం ఆసక్తికర ట్వీట్ చేశారు. -
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ.. ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆయన లేఖ రాశారు. -
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. -
BJP: కొత్త సీఎంలపై ఇంకా వీడని ఉత్కంఠ.. కమిటీలు వేసిన భాజపా
మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి ఐదురోజులైనా.. భాజపా(BJP) ఇంకా ముఖ్యమంత్రులను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియను కమలం పార్టీ ముమ్మరం చేసింది. -
ChandraBabu: వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే 3 నెలల తర్వాత నేనిస్తా: చంద్రబాబు
తాను ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టి క్షోభకు గురి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. -
TS Assembly: శాసనసభ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్తో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. -
Pawan Kalyan: కేసీఆర్కు గాయమైందని తెలిసి బాధపడ్డా: పవన్కల్యాణ్
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR)కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. -
Chandrababu: నా పర్యటన ఖరారైతే తప్ప జగన్లో కదలిక రాలేదు: చంద్రబాబు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
Daggubati Purandeswari: ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవు: పురందేశ్వరి
తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -
Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి: అధికారులకు సీఎం ఆదేశం
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
Anam Venkata Ramana Reddy: కుంభకోణం జరగలేదని తితిదే ఛైర్మన్ ప్రమాణం చేయగలరా?: ఆనం
ఆంధ్రప్రదేశ్లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు. -
Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: ఎమ్మెల్సీ కవిత
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. -
ఏళ్లుగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వచ్చారా..?
గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు నిరసన సెగ తగిలింది. -
వైకాపా దుష్టపాలన ఇంకా మూడు నెలలే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్ను మీరు నాశనం చేసుకున్నట్లే. -
అసమర్థ ప్రభుత్వమిది.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శ
జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. -
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్సీ కె.కవిత
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత పిలుపునిచ్చారు. -
మమతపై కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
నెహ్రూను అవమానిస్తే పటేల్ను దూషించినట్టే
‘‘భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు. -
న్యాయస్థానాలు, హరిత ట్రైబ్యునల్ ఆదేశాలంటే లెక్కలేదా?
రాష్ట్రంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలను సీఎం జగన్, వైకాపా నేతలు కొల్లగొడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. -
పాఠశాలల విలీనంతో విద్యా వ్యవస్థలో సమస్యలు
మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మార్గదర్శకాలు విద్యా వ్యవస్థలో అనేక సమస్యలకు కారణమవుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.


తాజా వార్తలు (Latest News)
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!
-
Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్ షా
-
The Archies Review: రివ్యూ: ది ఆర్చిస్.. బాలీవుడ్ వారసుల మూవీ ఎలా ఉంది?
-
ఘోరం.. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు మృతి..!
-
APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఎన్నంటే?