తెలంగాణకు భరోసా ఇవ్వని ప్రధాని
మోదీ దేశానికి ప్రధానమంత్రా? గుజరాత్కా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు.
మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజం
ఈనాడు, హైదరాబాద్: మోదీ దేశానికి ప్రధానమంత్రా? గుజరాత్కా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకుండా.. పసుపు బోర్డును కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని రేవంత్ విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రీల జయంతి సందర్భంగా వారికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నేతలు మధుయాస్కీ, చిన్నారెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రోహిన్రెడ్డిలతో కలసి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టిన ఆయనతో సభ నిర్వహించినందుకు పాలమూరు జిల్లా ప్రజలకు డి.కె.అరుణ, జితేందర్రెడ్డి క్షమాపణలు చెప్పాలి. తెలంగాణను మోదీ అవమానించినందుకే భాజపా నేతలు వివేక్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయశాంతి, రాజ్గోపాల్రెడ్డి సభకు హాజరు కాలేదనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని మోదీ ఎందుకు చెప్పలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఓట్లు చీల్చి భారాసను గెలిపించాలని ఆయన చూస్తున్నారు.
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోల్లోని హామీల అమలుపై చర్చకు వస్తా. 2014, 2018 ఎన్నికల్లో తెరాస(ప్రస్తుత భారాస) ప్రకటించిన మ్యానిఫెస్టోల్లోని హామీల అమలుపై కేటీఆర్, హరీశ్రావు చర్చకు వస్తారా? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? కాంగ్రెస్లో సీఎంలు మారతారని భారాస మంత్రులు విమర్శిస్తున్నారు. బహుళ నాయకత్వముంటే తప్పేంటి? కర్ణాటక ప్రభుత్వ వసూళ్లపై కేటీఆర్కి అనుమానం ఉంటే విచారణ చేయించాలని లేఖ రాయాలి. తెలంగాణ ప్రభుత్వ వసూళ్లపై విచారణ జరపాలని నేను కూడా లేఖ రాస్తే విచారణ జరిపిస్తారా?
సీఈసీ భేటీ తర్వాతే అభ్యర్థుల ప్రకటన
వచ్చే ఎన్నికల్లో భారాసకు 25 సీట్లకు మించి రావు. మహిళా ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారు. రాష్ట్రంలో 19 శాతం ఓటర్లు తటస్థంగా ఉన్నారు. వీరిలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్కే వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతో ఉచిత సిలిండర్లు, సన్నబియ్యం రేషన్, రైతులకు పింఛన్లు లాంటి హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ తర్వాతే పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. చాలామంది భాజపా, భారాస నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారు. పొత్తులు, షర్మిల చేరిక అంశాలను అధిష్ఠానం చూసుకుంటుంది. సీట్ల కేటాయింపులో నేను, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కుమ్మక్కయ్యామని ఎవరూ అపోహపడొద్దు. బీసీలకు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. ఎన్నికల షెడ్యూలు ప్రకటన తర్వాత ప్రచార ప్రణాళిక ఖరారు చేస్తాం’’ అని రేవంత్రెడ్డి తెలిపారు.
‘జీవో 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయండి’
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రభుత్వ జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని జీవో 317 ఉద్యోగ, ఉపాధ్యాయ బాధితుల సంఘం ప్రతినిధులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కోరారు. సోమవారం వారు గాంధీభవన్లో రేవంత్ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు.
కొడంగల్ నియోజకవర్గ భారాసకు చెందిన పలువురు సోమవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: నేను వెళ్తున్నానని.. ఇప్పుడు జగన్ హడావుడిగా బయల్దేరారు: చంద్రబాబు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
Daggubati Purandeswari: ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవు: పురందేశ్వరి
తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు బాగా దెబ్బతిన్నాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -
Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి: అధికారులకు సీఎం ఆదేశం
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు గాయమైన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
Anam Venkata Ramana Reddy: కుంభకోణం జరగలేదని తితిదే ఛైర్మన్ ప్రమాణం చేయగలరా?: ఆనం
ఆంధ్రప్రదేశ్లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు. -
Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: ఎమ్మెల్సీ కవిత
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పందించారు. -
ఏళ్లుగా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వచ్చారా..?
గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు నిరసన సెగ తగిలింది. -
వైకాపా దుష్టపాలన ఇంకా మూడు నెలలే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్ను మీరు నాశనం చేసుకున్నట్లే. -
అసమర్థ ప్రభుత్వమిది.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శ
జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం అన్ని రకాలుగానూ నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. -
సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: ఎమ్మెల్సీ కె.కవిత
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని తెబొగకాసం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కె.కవిత పిలుపునిచ్చారు. -
మమతపై కేంద్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. -
నెహ్రూను అవమానిస్తే పటేల్ను దూషించినట్టే
‘‘భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివారు. -
న్యాయస్థానాలు, హరిత ట్రైబ్యునల్ ఆదేశాలంటే లెక్కలేదా?
రాష్ట్రంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలను సీఎం జగన్, వైకాపా నేతలు కొల్లగొడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. -
పాఠశాలల విలీనంతో విద్యా వ్యవస్థలో సమస్యలు
మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మార్గదర్శకాలు విద్యా వ్యవస్థలో అనేక సమస్యలకు కారణమవుతాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. -
ఓటమి భయంతోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేత
బాపట్ల జిల్లా భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే వైకాపా వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ ధన దాహానికి రైతులు బలి: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ధనదాహం బకాసురుని ఆకలి వంటిదని ప్రజలు భావించే పరిస్థితి నెలకొందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. -
సంక్షిప్త వార్తలు (5)
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భాజపా ఎంపీ రమేశ్ బిధురి విచారం వ్యక్తం చేశారు. -
సుపరిపాలన భాజపాకే సాధ్యం
సుపరిపాలనను భాజపా మాత్రమే అందించగలదని దేశ ప్రజలు భావిస్తున్నందునే ఆ పార్టీ ప్రభుత్వాలకు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
విలీనం దిశగా.. మూడు విప్లవ పార్టీలు
మూడు విప్లవ పార్టీలు పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇనిషియేటివ్లు త్వరలో ఉమ్మడి పార్టీగా విలీనమవుతున్నట్లు ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ కార్యనిర్వహణ కమిటీ కన్వీనర్ పోటు రంగారావు, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి హన్మేష్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి: తమ్మినేని
తుపాను కారణంగా రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది రైతులు సుమారు రూ.3,500 కోట్ల పంట నష్టపోయినట్లు సీపీఎం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక
-
Chandrababu: నేను వెళ్తున్నానని.. ఇప్పుడు జగన్ హడావుడిగా బయల్దేరారు: చంద్రబాబు
-
మోదీజీతో మా నాన్న.. కంగారేస్తోంది: స్మృతి ఇరానీ పోస్టు వైరల్
-
Daggubati Purandeswari: ఏపీ మంత్రులెవరూ రైతులను పరామర్శించిన దాఖలాల్లేవు: పురందేశ్వరి
-
Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్ తీరు..
-
KCR: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల