కాంగ్రెస్లో కాక
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నవారిలో అసంతృప్తి పెరుగుతోంది. భారాస, భాజపాల నుంచి పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారని, మరికొందరూ త్వరలో రానున్నారని ఒకవైపు పీసీసీ నేతలు చెబుతుండగా..
ఇతర పార్టీల నుంచి చేరినవారికి టికెట్ల ఖరారుపై ప్రచారం
సీనియర్ నేతలు, ఆశావహుల్లో అసంతృప్తి
మైనంపల్లి చేరికతో మెదక్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుల రాజీనామాలు
ఈనాడు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నవారిలో అసంతృప్తి పెరుగుతోంది. భారాస, భాజపాల నుంచి పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారని, మరికొందరూ త్వరలో రానున్నారని ఒకవైపు పీసీసీ నేతలు చెబుతుండగా.. మరోవైపు పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతుండటం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆది, సోమవారాల్లో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)ల అధ్యక్షులు కాంగ్రెస్కు రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపింది.
ఫలించని బుజ్జగింపులు
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం 1,006 మంది దరఖాస్తు చేశారు. తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఖరారవుతున్నాయని జరుగుతున్న ప్రచారంతో కొన్ని జిల్లాల్లో పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి భారాస ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో మెదక్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేశారు. మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. మైనంపల్లి చేరికతో అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క, మల్లు రవి తదితర సీనియర్ నేతలు స్వయంగా నందికంటి నివాసానికి వెళ్లి పార్టీని వీడవద్దని.. ఎన్నికల్లో గెలిచాక మంచి అవకాశాలుంటాయని చెప్పారు.
అదేరోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్వయంగా దిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయని, పార్టీ కోసం పనిచేయాలని బుజ్జగించారు. అయినా శ్రీధర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు, మైనంపల్లి కుమారుడు రోహిత్రావుకు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తారంటూ ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారంతో.. మెదక్ డీసీసీ అధ్యక్షుడు కె.తిరుపతిరెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన 2019 నుంచి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. మైనంపల్లి చేరికతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్లో డబ్బు రాజకీయాలు సాగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిరెడ్డి, నందికంటి శ్రీధర్లు భారాసలో చేరనున్నారని తెలుస్తోంది.
ఆ రెండు జిల్లాల్లోనూ..
నారాయణపేట, మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షులు కూడా టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జిల్లాల్లో సైతం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు దక్కితే ఈ రెండు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు తీసుకునే నిర్ణయంపై చర్చ సాగుతోంది. ‘‘ఇతర పార్టీల నుంచి ప్రముఖ నేతలను, బలమున్నవారిని కాంగ్రెస్లో చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర పార్టీలు కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వారిని ఆకర్షించి చేర్చుకోవడం సాధారణం. ఒకరిద్దరు నేతలు రాజీనామా చేసినంత మాత్రాన పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం ఉండదు. ఎన్నికల సమయంలో చేరికలు, రాజీనామాలు మామూలే’’ అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. 119 స్థానాల్లో గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందని, టికెట్ రాదనే అనుమానంతో అసంతృప్తికి గురవుతున్నవారిని అంతర్గతంగా బుజ్జగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్లో తిరిగి చేరిన యాదాద్రి డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.అనిల్కుమార్కు భువనగిరి అసెంబ్లీ టికెట్ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కార్యకర్తలపై కేసులు బనాయించిన వారికి టికెట్ హామీ ఇచ్చినందుకే రాజీనామా
-శ్రీధర్
అల్వాల్, న్యూస్టుడే: కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులపాలు చేసిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడికి పార్టీ తరఫున పోటీ చేసే అవకాశంపై హామీ ఇచ్చినందుకు మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన సోమవారం సాయంత్రం ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రం పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Elections: మంత్రి కేటీఆర్పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. భారాస క్యాడర్కు పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. -
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)(Btech Ravi)కి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
TS Elections: కల్వకుర్తిలో కాంగ్రెస్, భారాస శ్రేణుల ఘర్షణ
అసెంబ్లీ ఎన్నికల (Telangana Election 2023) నేపథ్యంలో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
Nara Lokesh: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్
రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. -
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని వైకాపా అభిమాని పేముల మనోహర్ ప్రశ్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. -
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
‘ఎన్నికలకు మహా అయితే 140 రోజుల గడువుంది.. ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది. -
అయిదేళ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. -
15 మందిలో 10 మంది వారే
ముఖ్యమంత్రి జగన్ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రం నుంచి డిప్యుటేషన్పై తీసుకొస్తే.. వారిలో పది మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. -
పర్చూరు వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకలాపాలు పెరిగాయి. -
వైకాపా గద్దె దిగకుంటే ప్రజలకు కష్టాలే
ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పీఎఫ్ చెల్లింపులు ఆగిపోయాయని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులూ అందడం లేదని విమర్శించారు. -
132 ఓట్ల తొలగింపునకు ఒకే వ్యక్తి దరఖాస్తు
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒకే వ్యక్తి 132 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఓటర్ల జాబితాలో అక్రమాలపై విచారణ చేపట్టండి
జిల్లాలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. -
మంత్రి బొత్స ఇలాకాలోని జాబితాలో మృతుల పేర్లు
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబును అడ్డుకుంటున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతోనే ఆయన్ను బయట తిరగకుండా అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో శతవిధాలా ప్రయత్నించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అప్పుల్లో దేశంలోనే నంబర్-1 గా ఏపీ
రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు వినియోగించకుండా తన రెవెన్యూ ఖర్చులకు ఉపయోగిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. -
మట్కా, బెట్టింగ్ ఆడేవారిని ఉరేస్తారా?
మట్కా, క్రికెట్ బెట్టింగ్కు పాల్పడేవారిపై.. వాటి నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అన్నారు. -
అయిదు రాష్ట్రాల్లో.. 18% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల వాటా 29%. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. -
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూబకాసురులు ఎవరు?
లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూములు కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులపరమవుతుంటేే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి విజయ్కుమార్ ప్రశ్నించారు. -
ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇంకెవరూ లేరా?
ఒక సామాజికవర్గానికి చెందిన వారే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం వెనకున్న ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన మండలాధ్యక్షులు
నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. -
అధికారంలోకి రాగానే ఖాళీలన్నీ భర్తీ: నాగబాబు
తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
US Citizenship: పాస్పోర్టు రెన్యూవల్కు అప్లై చేస్తే.. పౌరసత్వమే పోయింది!
-
Naresh: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి..: నరేశ్ పోస్ట్ వైరల్
-
Hyderabad: రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.2కోట్ల ఆస్తి నష్టం
-
Byjus: బైజూస్కు వరుస షాకులు.. ఓవైపు బీసీసీఐ.. మరోవైపు ప్రోసస్!
-
Ts Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Virgin Atlantic: వంట నూనె ఇంధనంగా.. దూసుకెళ్లిన తొలి కమర్షియల్ విమానం!