తప్పుడు కేసులతో కక్షసాధింపు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని, అందుకే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, కక్ష సాధింపునకు దిగారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజం
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ దిల్లీలో నిరశన దీక్ష
ఈనాడు, దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని, అందుకే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి, కక్ష సాధింపునకు దిగారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నారా భువనేశ్వరి రాజమండ్రిలో చేపట్టిన నిరశన దీక్షకు సంఘీభావంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రామ్మోహన్నాయుడు, రఘురామకృష్ణరాజు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్రావులతో కలిసి లోకేశ్ దీక్ష చేపట్టారు. కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో జరిగిన ఈ దీక్ష అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మహాత్మాగాంధీ, మండేలా లాంటి మహానుభావులు నమ్ముకున్న సిద్ధాంతం కోసం జైలుకు వెళ్లారని, ఇప్పుడు యువతకు ఉపాధి కల్పించడానికి యుద్ధప్రాతిపదికన పని చేసినందుకు జగన్మోహన్రెడ్డి నా తండ్రిని జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు మాకు చెప్పడమే కాదు చేసి చూపించేవారు. అందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేú,‡ 2.15 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. అందులో 80 వేల మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్కు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలూ దక్కాయి. నాడు సైబరాబాద్, నేడు అమరావతితోపాటు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరులను పెద్దఎత్తున అభివృద్ధి చేసింది చంద్రబాబే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే చంద్రబాబుపై దొంగకేసులు పెట్టి జైలుకు పంపాలన్న లక్ష్యంతో పనిచేసింది. అందులో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. అయినప్పటికీ కార్యకర్తలు, ప్రజలు వెనక్కు తగ్గకుండా 24 రోజులుగా శాంతియుతంగా రోడ్లమీదికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులూ పెద్దఎత్తున పాల్గొని ‘మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మీరందరూ ఒప్పుకుంటే చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతినాడు నిరాహారదీక్ష చేయాలనుకుంటున్నానని అమ్మ భువనేశ్వరి పొలిటికల్ యాక్షన్ కమిటీని కోరారు. ఆమెకు సంఘీభావం తెలుపుతూ దిల్లీతోపాటు, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, పక్క రాష్ట్రాల్లో దీక్షలు చేపట్టిన తెలుగువారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం వద్ద ఆధారాలుంటే న్యాయమూర్తికి అందించేవారు. అవి లేవు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు ఎక్కడ బెయిల్ వస్తుందోనన్న భయంతో మరో పీటీ వారంట్ సిద్ధంగా పెట్టుకొని మరో దొంగ కేసులో ఇబ్బంది పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి మూడు కేసులు సిద్ధం చేశారు. లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరిని జైలుకు పంపుతామని మంత్రులు రోజుకోసారి ప్రకటనలు చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు. తెదేపా తరఫున మా పోరాటం కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దొంగ పనులన్నీ ఆధారాలతో ప్రజల ముందు పెడతాం. నాపై ఇప్పటికి మూడు కేసులు ఉన్నాయని తెలుసు. అవి నేను మంత్రిగా పనిచేసినప్పుడు నా శాఖకు ఎలాంటి సంబంధం లేని నిర్ణయాలు. దొంగకేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసినట్లు నా విషయంలోనూ చేస్తే న్యాయం, చట్టాలే కాపాడాలి. దేశంలో 99% రాజకీయ పార్టీలు, నాయకులు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు. అసలు రోడ్డే లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నాకు నోటీసులిచ్చి సంబంధంలేని డాక్యుమెంట్లు అడుగుతున్నారు. నేను సీఐడీ విచారణకు హాజరవడానికి సిద్ధం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ను అరెస్టు చేసే ఉద్దేశం లేదని ఈ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. మేం ఓ పిచ్చివాడితో పోరాడుతున్నందున ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాం. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం’ అని లోకేశ్ పేర్కొన్నారు.
పెద్దఎత్తున పాల్గొన్న తెలుగువారు
లోకేశ్ దీక్షలో తెలుగుదేశం శ్రేణులు, దిల్లీలోని తెలుగువారు, ఇక్కడి యూనివర్శిటీల్లో చదువుతున్న, సివిల్స్ శిక్షణ తీసుకుంటున్న తెలుగు విద్యార్థులు, నోయిడా, గురుగ్రామ్ల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గ్గొని సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు యోగక్షేమాలు కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. లోకేశ్తోపాటు, దీక్షలో పాల్గొన్న ఎంపీలకు చిన్నారులతో నిమ్మరసం ఇప్పించి దీక్ష విరమింపజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Amaravati: ఓట్ల తొలగింపు.. 8 జిల్లాల కలెక్టర్లపై ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
TS Elections: మంత్రి కేటీఆర్పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. భారాస క్యాడర్కు పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. -
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)(Btech Ravi)కి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
TS Elections: కల్వకుర్తిలో కాంగ్రెస్, భారాస శ్రేణుల ఘర్షణ
అసెంబ్లీ ఎన్నికల (Telangana Election 2023) నేపథ్యంలో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
Nara Lokesh: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్
రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. -
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని వైకాపా అభిమాని పేముల మనోహర్ ప్రశ్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. -
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
‘ఎన్నికలకు మహా అయితే 140 రోజుల గడువుంది.. ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది. -
అయిదేళ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. -
15 మందిలో 10 మంది వారే
ముఖ్యమంత్రి జగన్ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రం నుంచి డిప్యుటేషన్పై తీసుకొస్తే.. వారిలో పది మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. -
పర్చూరు వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకలాపాలు పెరిగాయి. -
వైకాపా గద్దె దిగకుంటే ప్రజలకు కష్టాలే
ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పీఎఫ్ చెల్లింపులు ఆగిపోయాయని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులూ అందడం లేదని విమర్శించారు. -
132 ఓట్ల తొలగింపునకు ఒకే వ్యక్తి దరఖాస్తు
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒకే వ్యక్తి 132 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఓటర్ల జాబితాలో అక్రమాలపై విచారణ చేపట్టండి
జిల్లాలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. -
మంత్రి బొత్స ఇలాకాలోని జాబితాలో మృతుల పేర్లు
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబును అడ్డుకుంటున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతోనే ఆయన్ను బయట తిరగకుండా అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో శతవిధాలా ప్రయత్నించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అప్పుల్లో దేశంలోనే నంబర్-1 గా ఏపీ
రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు వినియోగించకుండా తన రెవెన్యూ ఖర్చులకు ఉపయోగిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. -
మట్కా, బెట్టింగ్ ఆడేవారిని ఉరేస్తారా?
మట్కా, క్రికెట్ బెట్టింగ్కు పాల్పడేవారిపై.. వాటి నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అన్నారు. -
అయిదు రాష్ట్రాల్లో.. 18% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల వాటా 29%. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. -
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూబకాసురులు ఎవరు?
లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూములు కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులపరమవుతుంటేే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి విజయ్కుమార్ ప్రశ్నించారు. -
ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇంకెవరూ లేరా?
ఒక సామాజికవర్గానికి చెందిన వారే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం వెనకున్న ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన మండలాధ్యక్షులు
నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
China: ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ.. చైనా కఠిన నిర్ణయం..!
-
Hyderabad: ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు
-
Social Look: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మానస్.. చెమటోడ్చిన దివి
-
Royal Enfield: వచ్చే ఏడాదిలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రానున్న బైక్స్ ఇవే..
-
Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే
-
IREDA IPO: అదరగొట్టిన IREDA.. 87% ప్రీమియంతో ముగిసిన షేర్లు