తెదేపా-జనసేన పొత్తుపై ప్రజల్లో నమ్మకం
‘తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ కూటమి గెలుస్తుందన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది. జగన్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిన అవసరముంది.
వైకాపా నేతలు నిరాశలో ఉన్నారు
కులాల పరిధి దాటితేనే అభివృద్ధి
రాజధాని ఏదో తెలియని రాష్ట్రంగా ఏపీ
పార్టీ సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-మచిలీపట్నం: ‘తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ కూటమి గెలుస్తుందన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది. జగన్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిన అవసరముంది. దీనిని ప్రజలు ముక్తకంఠంతో ఆమోదిస్తున్నారు. తెదేపా, జనసేన పొత్తు ప్రజలు నిర్ణయించింది. రాజకీయాల్లో ప్రజల కోసమే పనిచేయాలి. వ్యక్తిగత లెక్కలేమీ ఉండవు. జనసేన రోడ్లపై పోరాటం చేసే పార్టీగానే మిగిలిపోకూడదు. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి నాలుగో విడత యాత్రలో భాగంగా పవన్ సోమవారం మచిలీపట్నంలో పర్యటించారు. ఓ కల్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజ్యాధికారమనే రక్తం మరిగిన వైకాపా నాయకుడిని ఇంటికి పంపించడమే మన ముందున్న లక్ష్యమని ఉద్బోధించారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైకాపా.. ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తోందని, దొంగ ఓట్లు చేరుస్తోందని ఆరోపించారు. ‘వైకాపా ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మనం కచ్చితంగా గెలుస్తున్నాం. గెలుపు నిష్పత్తిని బట్టి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేదా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయిద్దాం’ అని పేర్కొన్నారు.
‘సీఎం జగన్ మూడు రాజధానులని హడావుడి చేశారు. సామాన్యుడు ఎక్కడికని తిరగగలడు? రాష్ట్రం విడిపోయి దశాబ్దం అవుతున్నా ఏది రాజధానో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయాం. జగన్ డ్రాకులా మాదిరిగా అధికారానికి అలవాటుపడ్డారు. నేను చాలా ఏళ్లుగా చూస్తున్నా. కడప జిల్లాలో ఓ పోలీస్ అధికారిని లాకప్లో వేసి దాడి చేశారు. జగన్ స్వభావం దుర్మార్గంగా ఉంటుందని అతని సన్నిహితులు చెబుతారు. తెలంగాణలో వారి ముఠా చేసిన దోపిడీ వల్లే అక్కడి యువత తిరుగుబాటు చేసింది. ఇలాంటి వ్యక్తి ఏపీకి హానికరమని మొదటి నుంచీ చెబుతున్నా. వైకాపా నేతలు మరో 6 నెలల్లో ఇంటికి వెళ్లబోతున్నారు’ అని అన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తీసుకువచ్చిన విధానాలను పవన్ తప్పుపట్టారు. బందరు పోర్టుకు మూడుసార్లు శంకుస్థాపన చేశారని, ఇదో ఎన్నికల గిమ్మిక్కు అని దుయ్యబట్టారు.
పరస్పరం గౌరవించుకుందాం: పొత్తు ధర్మం ప్రకారం జనసేన- తెదేపా నాయకులు, కార్యకర్తలు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగాలని, మనలో మనం గొడవ పడితే మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని పవన్ హెచ్చరించారు. ‘మన మధ్య చిచ్చుపెట్టడానికి వైకాపా నేతలు కాచుకుని కూర్చున్నారు. వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు. నేను వేదికలపై జనసేన-తెలుగుదేశం అని సంబోధిస్తాను. తెదేపా నాయకులు కూడా తెలుగుదేశం-జనసేన అని చెబుతారు. ఇరు పార్టీల గౌరవానికి భంగం కలగకుండా పొత్తును ముందుకు తీసుకెళ్దాం. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెదేపాను జనసేన కార్యకర్తలు తక్కువ అంచనా వేయొద్దు. వారి పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో మిత్రధర్మం పాటిద్దాం. పోరాటాలకు వేదికైన జనసేనను సైతం తెదేపా శ్రేణులు సముచితంగా గౌరవించాలి. రాజధాని విషయమై నేను తెదేపాతో గతంలో విభేదించినప్పటికీ..అంధకారంలోకి జారిపోతున్న రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు సహకరించుకోవాల్సిన అవసరముంది. దీనివల్ల జనసేన ఎదుగుతుంది. తెలుగుదేశం స్థిరపడుతుంది. కలసి పని చేయాలనుకునే వారికి కూడా స్నేహహస్తం అందిస్తాం’ అని జనసేనాని వివరించారు.
కులాల మధ్య ఐక్యత అవసరం: ‘కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే అభివృద్ధి సాధ్యం కాదు. కులాల ఐక్యతపై పదేపదే చెబుతుంటా. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని పార్టీలు గుర్తించాలి. నేను అన్ని కులాలనూ సమదృష్టితో చూసే వ్యక్తిని. ప్రత్యేకంగా కులాలు వెతుక్కుని స్నేహాలు చేయను. వైకాపా ప్రభుత్వంలో కీలక పదవులన్నీ ఒకే సామాజికవర్గంతో నింపేశారు. అధిక సంఖ్యలో ఉన్న కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఒక కులంపై మరొకరికి ద్వేషం అనవసరం. పార్టీ పెట్టగానే అధికారం రాదు. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. తొలిసారే అధికారంలోకి రావడం ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా, మన భావజాలమే భవిష్యత్తులో దేశమంతా వ్యాపిస్తుంది. బలమైన నాయకులు జనసేన నుంచి తయారుకావాలి’ అని ఆకాంక్షించారు.
పాలకులది సంస్కారం లేని రాజకీయం: జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘పాలకులు కనీస సంస్కారం మరచి రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని అందరూ ఖండించాలి. అసెంబ్లీలో పవన్ ఉంటే రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చేది కాదు. రెండేళ్ల క్రితమే ఆయన దూరదృష్టితో ‘వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్’ దిశగా అడుగులు వేశారు. అవనిగడ్డ సభకు వచ్చే వారిని మూడు కి.మీ. దూరంలో పోలీసులు ఆపేసినా విజయవంతమైంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్ చేసిన వారిని కూడా పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. తెదేపా కార్యక్రమాలకు మన పార్టీ నేతలు సహకరించాలి. జనసేన కార్యక్రమాలకు కూడా వారిని ఆహ్వానించాలి’ అని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు
దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ ఏం చేస్తున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు. -
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
వర్షంలో పవార్ ప్రసంగం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వర్షం కురిసింది. అయితే.. దానిని లెక్కచేయకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్కు యూపీ కోర్టు సమన్లు
కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ అయ్యాయి. -
Nara Lokesh: వైకాపా దోచిన డబ్బును ప్రజలకు ఇప్పిస్తాం
‘నేను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారు. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్’ అని పిలవగలుగుతున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
యువగళం శబ్దానికి.. పాలకపక్షం పునాదులు కదులుతాయ్
తెదేపా యువనేత నారా లోకేశ్ రెండోవిడత యువగళం పాదయాత్ర శబ్దానికి పాలకపక్షం పునాదులు కదలడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. -
యువగళం.. ప్రభం‘జనం’
వేల మంది అభిమానులు.. దారిపొడవునా నీరాజనాల నడుమ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం పునఃప్రారంభమైంది. -
సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
సీఎం జగన్కు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ తమ సమస్యల్ని పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో వైకాపా సర్కారును కూల్చేస్తామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెయ్య హెచ్చరించారు. -
వైకాపా సామాజిక యాత్రతో ఇక్కట్లు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ స్థానికులను ఇబ్బందులకు గురి చేసింది. -
మార్పు రాకపోతే బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే
‘ప్రజల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే వారి బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే’ అనే సందేశాన్నిచ్చేలా ఉన్న ఓ లఘుచిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. -
తాడిపత్రిలో బస్సు యాత్ర వెలవెల
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరవైంది. సభలో కనీసం కుర్చీలు వేయకపోవడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
మంత్రాలయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబి) మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి తనయులు వైకాపాకు రాజీనామా చేశారు. -
నంద్యాల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా ఫరూక్
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నియమితులయ్యారు. -
అవినీతికి సహకరిస్తారనే డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా?
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు మీ అవినీతికి సహకరించడం లేదనే కేంద్ర సర్వీసుల నుంచి నాన్ క్యాడర్ ఐఏఎస్లను డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా అని సీఎం జగన్ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. -
వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే..: అచ్చెన్నాయుడు
‘తెదేపా-జనసేనలు కలిశాక గోదావరి జిల్లాల్లో వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే లెక్క..’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. యువగళం పాదయాత్ర సభలో ప్రసంగించారు. -
సామాజిక సాధికార యాత్రకు జనాల తరలింపు
ఏలూరు జిల్లా కైకలూరులో మంగళవారం జరగనున్న వైకాపా సాధికార యాత్రకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణకు అధికారులు, నాయకులు కృషి చేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు
-
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
-
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!