YSRCP - VMRDA: వైకాపా నేతల ‘మాస్టర్’ ప్లాన్!
నగరాలలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బృహత్తర ప్రణాళిక(మాస్టర్ ప్లాన్)కు అధికార పార్టీ నేతలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో మాస్టర్ ప్లాన్లో ఇష్టానుసారంగా సవరణలు చేయిస్తున్నారు.
వీఎంఆర్డీఏ ప్రణాళికలో ప్రతిపాదిత రహదారుల తొలగింపు
వారి వ్యాపార అవసరాలకు అనుగుణంగా మార్పులు
విశాఖలో ఏదైనా వారు చెప్పినట్లు చేయాల్సిందే
ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: నగరాలలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బృహత్తర ప్రణాళిక(మాస్టర్ ప్లాన్)కు అధికార పార్టీ నేతలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో మాస్టర్ ప్లాన్లో ఇష్టానుసారంగా సవరణలు చేయిస్తున్నారు. తమ వ్యాపారానికి అడ్డొస్తుందని ప్రతిపాదిత రహదారులను సైతం రద్దు చేయించుకుంటున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రయోజనాల కంటే నేతల సేవే పరమావధిగా వీరు వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆమోదించిన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) కొత్త మాస్టర్ ప్లాన్లో ఎప్పటికప్పుడు చేస్తున్న సవరణలే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్లో సవరణలు చేయాలంటే అదో పెద్ద ప్రక్రియ. అయితే అధికార పార్టీ నేతలకు ఇది పెద్ద కష్టం కావడం లేదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి అధికారుల సహకారంతో ఎప్పటికప్పుడు సవరణలు చేయించుకుంటున్నారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోకుండా సవరణలు చేసేస్తుంది.
- విశాఖలోని ఎండాడలో మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డుని 60 అడుగులకి కుదించారు. ఈ రోడ్డులో వైకాపా నేత ఒకరు భారీ హౌసింగ్ ప్రాజెక్టుని ప్రతిపాదించారు. 80 అడుగుల రోడ్డుతో ప్రాజెక్టులో కొంత స్థలాన్ని కోల్పోనున్నారు. ఆర్థికంగా నష్టమని భావించిన ఆయన ప్రతిపాదిత రోడ్డుని 60 అడుగులకు కుదించేలా ప్రభుత్వంలో చక్రం తిప్పారు. భవిష్యత్తులో ఈ రహదారిలో వాహనాల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున మాస్టర్ ప్లాన్ను సవరించవద్దని ప్రజలు కోరినప్పటికీ ప్రభుత్వం సవరణలు చేసేసింది.
- అధికార పార్టీ నేతకు చెందిన ఒక లేఅవుట్కు అడ్డొస్తోందని భీమునిపట్నం మండలం దాకమర్రిలో వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదిత 60 అడుగుల రోడ్డుని రద్దు చేశారు. రోడ్డు కారణంగా తన లేఅవుట్లోని ప్లాట్లకు నష్టం ఏర్పడుతుందన్న వేంకటేశ్వర డెవలపర్స్ మేనేజింగ్ భాగస్వామి, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి కేకే రాజు విజ్ఞప్తిపై ప్రభుత్వ స్థాయిలో ఆగమేఘాలపై దస్త్రాలు కదిలాయి. రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి కూడా ఒకరు ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించి మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదిత రోడ్డు రద్దు చేయించారు.
- విశాఖలోని ఎండాడ రెవెన్యూ విలేజ్లో బీచ్ రోడ్డు నుంచి వై-జంక్షన్ను కలిపే 80 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలన్న అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఒకరి విజ్ఞప్తిపై ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సర్వే నంబరు 98, 100, 101, 102, 103లో వెళ్లేలా మాస్టర్ ప్లాన్లో రోడ్డును ప్రతిపాదించారు. అందులో తనకు చెందిన విలువైన స్థలం పోతుందని గమనించిన ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి చక్రం తిప్పారు. దీనికి అధికారులు సహకరించడంతో మాస్టర్ ప్లాన్ నుంచి రోడ్డుని ఇటీవలే తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షంలో పవార్ ప్రసంగం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వర్షం కురిసింది. అయితే.. దానిని లెక్కచేయకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్కు యూపీ కోర్టు సమన్లు
కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ అయ్యాయి. -
Nara Lokesh: వైకాపా దోచిన డబ్బును ప్రజలకు ఇప్పిస్తాం
‘నేను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారు. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్’ అని పిలవగలుగుతున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
యువగళం శబ్దానికి.. పాలకపక్షం పునాదులు కదులుతాయ్
తెదేపా యువనేత నారా లోకేశ్ రెండోవిడత యువగళం పాదయాత్ర శబ్దానికి పాలకపక్షం పునాదులు కదలడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. -
యువగళం.. ప్రభం‘జనం’
వేల మంది అభిమానులు.. దారిపొడవునా నీరాజనాల నడుమ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం పునఃప్రారంభమైంది. -
సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
సీఎం జగన్కు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ తమ సమస్యల్ని పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో వైకాపా సర్కారును కూల్చేస్తామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెయ్య హెచ్చరించారు. -
వైకాపా సామాజిక యాత్రతో ఇక్కట్లు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ స్థానికులను ఇబ్బందులకు గురి చేసింది. -
మార్పు రాకపోతే బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే
‘ప్రజల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే వారి బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే’ అనే సందేశాన్నిచ్చేలా ఉన్న ఓ లఘుచిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. -
తాడిపత్రిలో బస్సు యాత్ర వెలవెల
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరవైంది. సభలో కనీసం కుర్చీలు వేయకపోవడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
మంత్రాలయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబి) మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి తనయులు వైకాపాకు రాజీనామా చేశారు. -
నంద్యాల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా ఫరూక్
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నియమితులయ్యారు. -
అవినీతికి సహకరిస్తారనే డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా?
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు మీ అవినీతికి సహకరించడం లేదనే కేంద్ర సర్వీసుల నుంచి నాన్ క్యాడర్ ఐఏఎస్లను డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా అని సీఎం జగన్ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. -
వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే..: అచ్చెన్నాయుడు
‘తెదేపా-జనసేనలు కలిశాక గోదావరి జిల్లాల్లో వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే లెక్క..’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. యువగళం పాదయాత్ర సభలో ప్రసంగించారు. -
సామాజిక సాధికార యాత్రకు జనాల తరలింపు
ఏలూరు జిల్లా కైకలూరులో మంగళవారం జరగనున్న వైకాపా సాధికార యాత్రకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణకు అధికారులు, నాయకులు కృషి చేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
-
Rameswaram Express: రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
-
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు