వైకాపాకు ఒక్క సీటూ రాదు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, వైకాపాకు ఒక్క సీటు కూడా రాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పులివెందులలో జగన్ కూడా గెలవరని జోస్యం చెప్పారు.
పులివెందులలో జగన్ కూడా గెలవరు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
అమరావతి, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, వైకాపాకు ఒక్క సీటు కూడా రాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పులివెందులలో జగన్ కూడా గెలవరని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు, అభివృద్ధి, అవినీతి లేని పాలన, ప్రజల బాగు కోసం.. సైకో ముఖ్యమంత్రి జగన్ను గద్దె దించి తెదేపా, జనసేన కూటమిని గెలిపించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో మంగళగిరిలో సోమవారం ‘సత్యమేవ జయతే’ దీక్ష చేపట్టారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మహిళలు, న్యాయవాదులతో కలిసి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. దీక్షకు సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు చిల్లపల్లి నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజమెత్తారు. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రూ.లక్షల కోట్లు సంపాదించినందునే కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలు 11 కేసులు నమోదు చేశాయన్నారు. ఒక అవినీతిపరుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ఒక పౌరుడిగా బాధగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు ఏమీ చేయలేని జగన్ ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక 70 దేశాల్లో చంద్రబాబుకు పెద్దఎత్తున సంఘీభావం తెలుపుతున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్, తాను ఒక్క అవినీతి చేసినట్లు నిరూపిస్తే నడిరోడ్డు మీద ఉరివేసుకుంటామని సవాల్ విసిరారు. ఇన్నర్ రింగు రోడ్డే లేనప్పుడు దానిలో అవినీతి జరిగిందని లోకేశ్పై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉన్నారన్నారు తన కేసుల్లో బెయిల్ కోసం అధికారంలోకి వచ్చిన తరువాత తమ ఎంపీలంతా కాంగ్రెస్కే మద్దతిస్తామని సోనియాగాంధీకి నమ్మబలికి జగన్ రాష్ట్ర విభజనకు సహకరించాడని ఆరోపించారు. పట్టాభి మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ద్వారా 24 వేల కిలోమీటర్లు కేబుల్ వైర్లు వేసి గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే వైర్లు కత్తిరించి అవినీతి జరిగిందని కేసులు పెడుతున్న అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో త్వరలో నిశ్శబ్ద యుద్ధం
‘‘సైకో జగన్.. ధనవంతులకు, పేదలకు యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. అది.. జగన్కు, పేదలకు మధ్య జరగనుంది. -
‘మాకెందుకు జగన్?’
‘ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే..’, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పేరిట వైకాపా నేతలు, వాలంటీర్లు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. సీఎం మేనమామ రవీంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో మాత్రం ‘మాకెందుకు జగన్?’ అంటున్నారు. -
బడిలో ‘జగనే ఎందుకు కావాలి?’
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని వేంబాకం ఉన్నత పాఠశాలలో ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలు తావిచ్చింది. -
మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభం
ప్రధాని మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభమేనని, పవిత్ర కార్యాలకు ఆయన్ను భాజపా దూరం ఉంచాలంటూ జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్రవణ్కుమార్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ను నడపగలిగే సరైన నేత ఖర్గే
రానున్న చరిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడపగలిగే సరైన నేత మల్లికార్జున ఖర్గే అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. -
అది జగన్ను ఆటాడేసుకునే కార్యక్రమంగా మారింది
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్తా సీఎం జగన్ను సామాజిక మాధ్యమాల్లో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. -
ఎస్టీ ఉపప్రణాళిక నిధులను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం
గిరిజనుల అభ్యున్నతికి కేంద్రం మంజూరు చేస్తున్న ఎస్టీ సబ్ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
విశాఖ నుంచే మరోసారి ఎంపీగా పోటీ
వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లు తెదేపాలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవరాయునిపేట పరిధిలో పనిచేస్తూ రాజీనామా చేసిన వాలంటీర్లు వి.ఉదయకిరణ్, కె.రాధిక, ఎస్.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి బుధవారం తెదేపాలో చేరారు. -
1న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని డిసెంబరు 1న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్
వైయస్ఆర్ జిల్లా పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు. -
జగన్ అండతోనే దళితులపై అకృత్యాలు
సీఎం జగన్ అండ చూసుకొని, ఆయన మెప్పు కోసమే వైకాపా నేతలు దళితులపై దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. -
సీఎంపై సర్పంచి ‘పంచ్లు’
‘ఒక్క రోడ్డు లేదు. విద్యుత్తు ఛార్జీలు రూ. 500 నుంచి రూ.5 వేలకు పెరిగాయి. అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి. -
నిరాడంబర దుస్తులు ధరించినా.. వారంతా సంపన్నులే
కొందరు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్రధారణ, వారు ధరించిన సాధారణ చేతిగడియారాలు చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
-
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
-
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు