గ్రామ స్వరాజ్యాన్ని జగన్ చంపేశారు
‘గ్రామ స్వరాజ్యాన్ని సాధించినప్పుడే మహాత్ముడికి నివాళి అర్పించినట్లు. దీనిని వైకాపా ప్రభుత్వం చేయలేకపోయింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్ తూట్లు పొడిచి చంపేశారు.
జనసేనాని పవన్ ధ్వజం
ఈనాడు, అమరావతి: ‘గ్రామ స్వరాజ్యాన్ని సాధించినప్పుడే మహాత్ముడికి నివాళి అర్పించినట్లు. దీనిని వైకాపా ప్రభుత్వం చేయలేకపోయింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్ తూట్లు పొడిచి చంపేశారు. పంచాయతీల అధికారాలన్నీ తీసేశారు’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ‘మన సమకాలీన నాయకులకు బ్రిటిష్ వారికి ఉన్నంత సంయమనం కూడా లేదు. కులం పేరుతో తెల్లవారి కంటే ఎక్కువగా సమాజాన్ని విభజిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల గాంధీ సిద్ధాంతాలను పూర్తిస్థాయిలో తీసుకెళ్లలేం. శాసనోల్లంఘన ద్వారానే ప్రజలు ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయొచ్చ’ని పవన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మచిలీపట్నంలో గాంధీజీ, లాల్బహదూర్ శాస్త్రి జయంత్యుత్సవాల్లో పాల్గొని.. మహనీయులకు నివాళులు అర్పించారు. పవన్ 30 నిమిషాలు మౌనదీక్షలో ఉన్నారు. వేదికపై పుస్తక పఠనం అనంతరం మాట్లాడారు.
జగన్ దోచేసి.. దాచేశారు
‘స్వాతంత్య్ర సమరయోధులు తమ త్యాగంతో దేశానికి గుర్తింపు తెచ్చారు. నేడు కొందరు నాయకులు అవినీతి, దౌర్జన్యం, రౌడీయిజంతో సంపాదించిన వేల బిలియన్ డాలర్ల సొమ్మును విదేశీ బ్యాంకుల్లో దాచారు. ఇక్కడి కష్టాన్ని, శ్రమను విదేశాల్లో దాచుకోవడం.. అడ్డగోలుతనం. సీఎం జగన్ కూడా చాలా సొమ్మును విదేశాలకు తరలించారు. ఆ సొమ్మంతా తిరిగి దేశానికి వస్తుందో లేదో తెలియదు కానీ, ఇకపై ఈ దోపిడీ ఆగాలంటే మనం పూనుకోవాల్సిందే. సమాజంలో అన్ని పనులూ ఒక్కరమే చేయలేం. సమష్టిగా నిలిస్తేనే మార్పు తేగలమని మనం గాంధీ నుంచి నేర్చుకోవాలి. జైజవాన్.. జైకిసాన్ అని నినదించిన లాల్బహదూర్ శాస్త్రి అందరికీ ఆదర్శప్రాయుడు. జగన్ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఎవరన్నా బాధ్యత తీసుకుంటే వారిని వేధించడం, నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు, నినదిస్తే జైల్లో పెట్టడం ఆయన నైజం. భావితరాలకు విలువలతో కూడిన రాజకీయాలను అందించాలనే లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది. బురదలో నుంచి కమలం వికసించినట్లే.. కలుషిత రాజకీయాల నుంచి జనసేన అనే కమలం బయటకు వస్తుంది’ అని పేర్కొన్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఇన్ఛార్జి బండి రామకృష్ణ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో పవన్ మచిలీపట్నంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో త్వరలో నిశ్శబ్ద యుద్ధం
‘‘సైకో జగన్.. ధనవంతులకు, పేదలకు యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. అది.. జగన్కు, పేదలకు మధ్య జరగనుంది. -
‘మాకెందుకు జగన్?’
‘ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే..’, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పేరిట వైకాపా నేతలు, వాలంటీర్లు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. సీఎం మేనమామ రవీంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో మాత్రం ‘మాకెందుకు జగన్?’ అంటున్నారు. -
బడిలో ‘జగనే ఎందుకు కావాలి?’
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని వేంబాకం ఉన్నత పాఠశాలలో ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలు తావిచ్చింది. -
మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభం
ప్రధాని మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభమేనని, పవిత్ర కార్యాలకు ఆయన్ను భాజపా దూరం ఉంచాలంటూ జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్రవణ్కుమార్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ను నడపగలిగే సరైన నేత ఖర్గే
రానున్న చరిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడపగలిగే సరైన నేత మల్లికార్జున ఖర్గే అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. -
అది జగన్ను ఆటాడేసుకునే కార్యక్రమంగా మారింది
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్తా సీఎం జగన్ను సామాజిక మాధ్యమాల్లో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. -
ఎస్టీ ఉపప్రణాళిక నిధులను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం
గిరిజనుల అభ్యున్నతికి కేంద్రం మంజూరు చేస్తున్న ఎస్టీ సబ్ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
విశాఖ నుంచే మరోసారి ఎంపీగా పోటీ
వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లు తెదేపాలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవరాయునిపేట పరిధిలో పనిచేస్తూ రాజీనామా చేసిన వాలంటీర్లు వి.ఉదయకిరణ్, కె.రాధిక, ఎస్.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి బుధవారం తెదేపాలో చేరారు. -
1న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని డిసెంబరు 1న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్
వైయస్ఆర్ జిల్లా పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు. -
జగన్ అండతోనే దళితులపై అకృత్యాలు
సీఎం జగన్ అండ చూసుకొని, ఆయన మెప్పు కోసమే వైకాపా నేతలు దళితులపై దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. -
సీఎంపై సర్పంచి ‘పంచ్లు’
‘ఒక్క రోడ్డు లేదు. విద్యుత్తు ఛార్జీలు రూ. 500 నుంచి రూ.5 వేలకు పెరిగాయి. అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి. -
నిరాడంబర దుస్తులు ధరించినా.. వారంతా సంపన్నులే
కొందరు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్రధారణ, వారు ధరించిన సాధారణ చేతిగడియారాలు చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.