మా జగన్నే తిడతావా అంటూ యువకుణ్ని కుళ్లబొడిచిన దుండగులు
మద్యం ధరల పెరుగుదలకు సీఎం జగన్మోహన్రెడ్డే కారణమని విమర్శించడమే ఆ యువకుడికి శాపంగా మారింది. దీనికి ఆగ్రహించిన ఇద్దరు దుండగులు అతడిని వెంటాడి దాడికి పాల్పడ్డారు. మన్నించండంటూ వేడుకున్నా కరుణించలేదు.
నిందితులు వైకాపా వారని ప్రచారం
మండపేట, న్యూస్టుడే: మద్యం ధరల పెరుగుదలకు సీఎం జగన్మోహన్రెడ్డే కారణమని విమర్శించడమే ఆ యువకుడికి శాపంగా మారింది. దీనికి ఆగ్రహించిన ఇద్దరు దుండగులు అతడిని వెంటాడి దాడికి పాల్పడ్డారు. మన్నించండంటూ వేడుకున్నా కరుణించలేదు. చివరికి దెబ్బలకు తట్టుకోలేక కిందపడిపోవడంతో బాధితుణ్ని వదిలేసి వెళ్లిపోయారు. దాడికి పాల్పడిన వారు వైకాపాకు చెందిన వారని జోరుగా ప్రచారం అవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బాధిత యువకుడు పట్టణంలోని ఒక మద్యం దుకాణం వద్ద సరకు తీసుకుంటున్న సమయంలో.. ధరలు పెరగడానికి కారణం జగనే అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే మద్యం తాగి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇది విని ద్విచక్ర వాహనంపై ఆ యువకుడిని వెంబడించారు.
కొద్ది దూరం తర్వాత అతడు తమ చేతికి చిక్కడంతో ‘మా జగన్ను తిడతావా..’ అంటూ దాడికి పాల్పడ్డారు. బాధితుడు కింద పడిపోయి వేడుకుంటున్నా కాళ్లతో కసితీరా తన్ని వెళ్లిపోయారు. ఈ ఘటనను సమీపంలోని మేడ పైనుంచి ఓ మహిళ చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. దీంతో సోమవారం ఉదయం మండపేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడి గత నెల 28వ తేదీ రాత్రి జరిగిందని, దాడికి పాల్పడిన వారితో పాటు దెబ్బలు తిన్న వ్యక్తి గురించి విచారిస్తున్నామని ఎస్సై తెలిపారు. మద్యం దుకాణాల వద్ద విచారించినా నిందితులు, బాధితుడికి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదన్నారు. దాడి చేసిన వ్యక్తులు వెళ్లిన వెంటనే దెబ్బలు తిన్న వ్యక్తి మామూలుగా లేచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అయితే సంబంధిత వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rahul Gandhi: కాంగ్రెస్ సర్కార్ చేతిలో భద్రంగా యువత భవిష్యత్తు: రాహుల్
తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. -
YSRCP MLC: వైకాపా ఎమ్మెల్సీ మూడో పెళ్లికి.. రెండో భార్య సాక్షి సంతకం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. -
Yuvagalam: మంత్రులూ.. మీకు కౌంట్డౌన్ మొదలైంది: నారా లోకేశ్
వ్యవస్థలను మేనేజ్ చేసి తెదేపా అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
Yuvagalam: పొదలాడ నుంచి నారా లోకేశ్ ‘యువగళం’ పునః ప్రారంభం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. -
మథురలో కృష్ణుడి ఆలయంపై మీ వైఖరేంటో చెప్పండి
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించడం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి ఇష్టంలేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపించారు. -
11 ఏళ్లలో మాపై 250 కేసులు నమోదు చేశారు
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న పార్టీ ఆమ్ఆద్మీ(ఆప్) అని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
వైకాపా నాయకుల స్వలాభంతో పేదలకు అన్యాయం
కాసులకు కక్కుర్తి పడిన వైకాపా నాయకులు చౌడు నేలలు, క్వారీల బాంబ్ బ్లాస్టింగ్లు జరిగే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. -
Yuvagalam: నేటి నుంచి కోనసీమలో ‘యువగళం’
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం నుంచి ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. -
మరి ఆ సంస్థ ఎలా తవ్వుతుంది?
ఆంధ్రప్రదేశ్లో ఇసుక టెండరు కాల పరిమితి ముగిసిందని జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు(ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) ఇచ్చిన నివేదికల్లో జేపీ పవర్ వెంచర్స్ సంస్థ స్పష్టం చేసిందని.. అయినా గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి మాత్రం పాత సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
ఓట్ల తొలగింపు కుట్రదారు.. మద్దాళి
‘గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కుట్రదారు ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ అని బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది. -
నిలదీస్తే నిర్బంధం... ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం
రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులకు దిక్కులేదని.. నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే అవినీతి, అరాచక పాలన సాగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
దళిత బహుజనుల హత్యలకు జగన్దే బాధ్యత
వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హత్యలు, వారిపై దారుణాలకు సీఎం జగన్దే బాధ్యతని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ప్రజల విశ్వాసం కోల్పోయిన మోదీ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన మాటను తప్పి ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. -
తెదేపా నేతల గృహ నిర్బంధం
పల్నాడు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు సిద్ధమైన తెదేపా-జనసేన నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
IPL-2024: ఐపీఎల్లో ఆడాలని ఉంది: పాకిస్థాన్ బౌలర్
-
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
-
Gautam Singhania: కంపెనీ కార్యకలాపాలు యథాతథం.. వాటాదారులు, ఉద్యోగులకు గౌతమ్ సింఘానియా లేఖ
-
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే
-
బాలుడిపై ఘోరం.. జామెట్రీ కంపాస్తో 108సార్లు దాడి!
-
Earthquakes: మళ్లీ వందల సంఖ్యలో భూప్రకంపనలు.. వణుకుతున్న గ్రిండావిక్