వివేకా కేసు రోజురోజుకూ నీరుగారిపోతోంది
సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తన ఉనికిని కోల్పోయి, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. శనివారం ఆయన
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి : సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తన ఉనికిని కోల్పోయి, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజురోజుకీ నీరుగారిపోతోంది. స్థానిక పోలీసులు సీబీఐకి సహాయనిరాకరణ చేయడమే దీనికి కారణం. ఈ కేసులో సీఎం కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని యావత్ రాష్ట్రం గగ్గోలు పెడుతోంది. నాడు పరిటాల రవి హత్య కేసులో నిందితులు చనిపోయినట్టే.. నేడు వివేకా హత్య కేసులోనూ జరుగుతోంది. ప్రతిపక్షాల్ని హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికే రాష్ట్రంలో సీఐడీ ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులను కనీసం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కాపాడాలని డీజీపీ, సీఐడీ చీఫ్లను కోరుతున్నా...’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు