Ayyanna Patrudu: అయ్యన్న ఇంటికి విశాఖ పోలీసులు.. ఐటీ చట్టం సహా పలు సెక్షన్లతో కేసు?
మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో సెక్షన్ 41ఎ నోటీసును అందజేసేందుకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులు ఇద్దరు గురువారం రాత్రి
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే: మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో సెక్షన్ 41ఎ నోటీసును అందజేసేందుకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులు ఇద్దరు గురువారం రాత్రి నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వెళ్లారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ను కలిసి తాము త్రీటౌన్ స్టేషన్ నుంచి నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయ్యన్న ఇంట్లో లేరని, నోటీసు తనకు ఇచ్చినా.. ఇంటికి అతికించినా అభ్యంతరం లేదని విజయ్ వారికి చెప్పారు. ఉన్నతాధికారులతో చర్చించాక మళ్లీ వస్తామంటూ వారు వెనుదిరిగారు. కేసు వివరాలను విజయ్ అడిగినా వెల్లడించేందుకు నిరాకరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. త్రీటౌన్ పోలీసులు క్రైం నంబరు 317 ప్రకారం సెక్షన్ 153, 153ఎ, 504, 505, సెక్షన్ 67 ఐటీ చట్టం ప్రకారం అయ్యన్నపై కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల కిందట పల్నాడు జిల్లా నకరికల్లు పోలీసులు గతంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి 41ఎ నోటీసు ఇచ్చేందుకు రావడం, స్థానికంగా అయ్యన్న లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్