ముస్లింలకు జగన్ దగా
దుల్హన్ పథకం కింద రూ. 50,000 కాదు.. లక్ష రూపాయిలు ఇస్తానంటూ హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి దాన్ని పూర్తిగా నిలిపివేయటం ముస్లింలను దగా చేయటమేనని జనసేన పొలిట్బ్యూరో సభ్యుడు అర్హంఖాన్, ప్రకాశం జిల్లా పార్టీ
జనసేన నాయకులు అర్హంఖాన్, షేక్ రియాజ్
ఈనాడు, అమరావతి: దుల్హన్ పథకం కింద రూ. 50,000 కాదు.. లక్ష రూపాయిలు ఇస్తానంటూ హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి దాన్ని పూర్తిగా నిలిపివేయటం ముస్లింలను దగా చేయటమేనని జనసేన పొలిట్బ్యూరో సభ్యుడు అర్హంఖాన్, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆరోపించారు. ముస్లింలను మోసం చేసిన ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. పాదయాత్రలో ముస్లింలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నెరవేర్చలేదని అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘మా దగ్గర డబ్బుల్లేవు.. అందుకే దుల్హన్ పథకం అమలు చేయట్లేదు’ అంటూ ప్రభుత్వం కోర్టుకు చెప్పటం సిగ్గుచేటని అన్నారు. వైకాపాలో ఉన్న ముస్లిం నాయకులు ఇప్పటికైనా జగన్ను నిలదీయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?