వైకాపా వికృత పోకడలను ప్రజలు గమనిస్తున్నారు
శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ ఉద్యోగిపై దాడి, ప్రకాశం జిల్లాలో మహిళకు వేధింపుల ఘటనలకు సిగ్గున్న ప్రభుత్వమైతే తలదించుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ ఉద్యోగిపై దాడి, ప్రకాశం జిల్లాలో మహిళకు వేధింపుల ఘటనలకు సిగ్గున్న ప్రభుత్వమైతే తలదించుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ వికృత పోకడలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.‘‘శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో సచివాలయ దివ్యాంగ ఉద్యోగి వాసుదేవరావుపై సర్పంచి భర్త గున్నయ్య దాడి చేశారు. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రిని సమస్యలపై ప్రశ్నించారని కవిత అనే మహిళ ఇంటికి విద్యుత్తు తొలగించి పాలు, నీళ్లు అందకుండా చేశారు. అధికార పార్టీ అహంకారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్న వైకాపా నాయకులు వీటికి తప్పక మూల్యం చెల్లించుకుంటారు. ఈ రెండు ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధితులను క్షమాపణ కోరాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ట్వీట్కు జత చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు