నాడు అమరావతి శ్మశానమన్నారు.. నేడు అమ్మకానికి పెట్టారు: లోకేశ్‌

అమరావతిని నాడు శ్మశానం అని.. నేడు ఎకరా రూ.పది కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైకాపా నేతలను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘వైకాపా వాళ్లు

Updated : 27 Jun 2022 12:57 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమరావతిని నాడు శ్మశానం అని.. నేడు ఎకరా రూ.పది కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైకాపా నేతలను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘వైకాపా వాళ్లు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వరదలు, భూకంపాల ముప్పు ఉందని ప్రచారం చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక శ్మశానం అన్నారు. నేడు ఎకరం రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అమరావతిపై జగన్‌ మోసపురెడ్డి కుట్రలకు అంతం లేదు’’ అని నారా లోకేశ్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని