Balineni Srinivasa Reddy: నాటకాలు ఆపకపోతే కాళ్లు విరగ్గొడతా!
సొంత పార్టీ నేతలే ప్రతిపక్షంతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా నాటకాలు ఆడుతున్నారని, ఇప్పటికైనా వారు పద్ధతి మార్చుకొని వాటిని ఆపకపోతే కాళ్లు విరగ్గొడతానని
సొంత పార్టీ నేతలకు బాలినేని హెచ్చరిక
ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్టుడే: సొంత పార్టీ నేతలే ప్రతిపక్షంతో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా నాటకాలు ఆడుతున్నారని, ఇప్పటికైనా వారు పద్ధతి మార్చుకొని వాటిని ఆపకపోతే కాళ్లు విరగ్గొడతానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇప్పటివరకు ఓపిక పట్టానని... తాను తింటుందీ ఉప్పూ కారమేనని... ఇకపై ఈ తరహా వ్యవహారాలు సహించేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంగళవారం నిర్వహించిన ఒంగోలు నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. ‘ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మంత్రి శ్రీనుతో మా పార్టీకి చెందిన కొందరు చేతులు కలిపి ఓ పథకం ప్రకారం నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వారు ఎవరన్నది నాకు తెలుసు. వారు ఎంత పెద్ద నాయకులైనా వదిలిపెట్టేది లేదు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తాను. ఇప్పటివరకు అన్నీ సహించాను. ఇకపై భరించే సహనం నాకు లేదు...’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?