ఒంగోలు వైకాపా ప్లీనరీలో బిల్లుల గోల
తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ కార్యకర్తలు ఒంగోలులో బుధవారం జరిగిన వైకాపా ప్రకాశం జిల్లా ప్లీనరీలో మంత్రి, ఎమ్మెల్యేల ఎదుట
గడప బయట బాగోలేదన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి
ఈనాడు డిజిటల్, ఒంగోలు: తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదంటూ కార్యకర్తలు ఒంగోలులో బుధవారం జరిగిన వైకాపా ప్రకాశం జిల్లా ప్లీనరీలో మంత్రి, ఎమ్మెల్యేల ఎదుట మొరపెట్టుకోగా...సకాలంలో బిల్లులు చెల్లించి అండగా నిలవాలంటూ ప్రజాప్రతినిధులు వారికి మద్దతుగా మాట్లాడటం స్థానికంగా నెలకొన్న పరిస్థితికి అద్దం పట్టింది. కార్యకర్తలు వ్యక్తం చేసిన ఆవేదన చర్చనీయాంశమైంది. ప్లీనరీలో తొలుత వైకాపా జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతుండగా తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఎప్పుడు ఇస్తారో చెప్పండంటూ కార్యకర్తల నుంచి అరుపులు వినిపించాయి. పెద్దలతో మాట్లాడుతున్నామని.. త్వరలో వచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు.
ముఖ్యమంత్రికే గ్రాఫ్ పెరుగుతోంది: దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రూ.100 కోట్ల వ్యయంతో పనులు చేయించానని.. బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన కార్యకర్తలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందన్నారు. ఒక కార్యకర్త ఆరునెలల నుంచి కనిపించడం లేదని..‘గడప గడపకు’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లి పలకరించగా.. రూ.25 లక్షల విలువైన పనులు చేసి, బిల్లులు రాకపోవడంతో ఇల్లు కూడా అమ్ముకున్నట్లు ఆయన భార్య విలపిస్తూ చెప్పారని అన్నారు. బటన్ నొక్కి ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్న ముఖ్యమంత్రికి గ్రాఫ్ పెరుగుతోందని, స్థానికంగా ఏమీ చేయలేక ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని వ్యాఖ్యానించారు. ఇది పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వేయాలన్నారు. గడప లోపల బాగున్నా...బయట బాగోలేదన్నారు. ప్రజలు సమస్యలపై అడుగుతున్నారని... ‘గడప గడపకు’ కార్యక్రమానికి రమ్మంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాయిదా వేస్తున్నారని తెలిపారు. బిల్లులు వారంలో వస్తాయని జిల్లా అధ్యక్షుడు బుర్రా చెబుతున్నారని, రాకుంటే అంతా కలిసి ఆయన ఇంటికి వెళదామని ఎమ్మెల్యే చమత్కరించారు. కార్యకర్తలు బాగుంటేనే మనం బాగుంటామని, బిల్లులు చెల్లించి ప్రోత్సహించాలని సమావేశంలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ జులై 10 లోపు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు. కష్టపడి పనులు చేసినవారికే టికెట్లు అని, మూడు జిల్లాల్లో అభ్యర్థులను ఎంపిక చేసి, గెలిపించే బాధ్యతను సీఎం తనకు అప్పగించారన్నారు.
గుత్తేదారును అడ్డుకున్న పోలీసులు: ప్లీనరీ జరుగుతుండగా కనిగిరికి చెందిన వైకాపా కార్యకర్త, గుత్తేదారు వెంకటకృష్ణారెడ్డి వినతిపత్రంతో ప్రవేశద్వారం వద్ద నిలుచున్నారు. పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా చేసిన పనులకు బిల్లులు రావాల్సి ఉందని.. అవి అడుగుతుంటే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా, పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆయనను ఒంగోలు తాలూకా స్టేషన్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM