Asaduddin Owaisi: బిహార్‌లో ఒవైసీకి బిగ్‌ షాక్‌

బిహార్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి రాజకీయంగా చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న అయిదుగురు శాసనసభ్యుల్లో ఒక్కరు మినహా నలుగురు బుధవారం ఆర్జేడీలో చేరారు. ఈ పరిణామంతో 243 మంది సభ్యులు

Updated : 30 Jun 2022 07:20 IST

ఆర్జేడీలో చేరిన నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు

పట్నా: బిహార్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి రాజకీయంగా చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న అయిదుగురు శాసనసభ్యుల్లో ఒక్కరు మినహా నలుగురు బుధవారం ఆర్జేడీలో చేరారు. ఈ పరిణామంతో 243 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో ఆర్జేడీ బలం 80కు చేరింది. భాజపా కంటే మూడు స్థానాలు ఎక్కువ కావడంతో లాలూ పార్టీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయే పాలన సాగుతున్న రాష్ట్రంలో లౌకిక శక్తులను బలోపేతం చేసే చర్యగా ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌ దీన్ని అభివర్ణించారు.  2020లో బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అయిదు స్థానాల్లో విజయంతో మజ్లిస్‌ పార్టీ సంచలనం సృష్టించింది. ఆ అయిదుగురిలో సయ్యద్‌ రుక్నుద్దీన్‌ అహ్మద్‌ (బాయీసీ), షానవాజ్‌ ఆలం (జోకీహాట్‌), మహ్మద్‌ ఇజార్‌ అస్ఫి (కోచాధామన్‌), మహ్మద్‌ అంజార్‌ నయీమీ (బహదూర్‌గంజ్‌) ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని