నాపై సీబీఐ కేసును రద్దు చేయండి: ఆమంచి
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు, దూషణల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును
ఈనాడు, అమరావతి: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు, దూషణల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య.. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ డీఎస్పీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు నోటీసులిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. జులై 20న సీబీఐ తన ముందు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చిందని పిటిషనర్ చెబుతున్నందున విచారణను జులై 15కే వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ దశలో సీబీఐ నమోదుచేసిన కేసులో స్టే ఇవ్వలేమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం