ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాలకు కన్నాలు వేయడం విడ్డూరం
రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాలకు కన్నాలు వేయడం విడ్డూరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల జీపీఎఫ్
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగుల ఖాతాలకు కన్నాలు వేయడం విడ్డూరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు కొట్టేసి పొంతనలేని కథలు వినిపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న కౌరవుల నుంచి మనల్ని రక్షించడానికి ఏ కృష్ణుడూ లేడని, ఒకవేళ శ్రీకృష్ణుడు వచ్చినా ఏమీ చేయలేరన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే రూ.8 వేల కోట్ల అప్పుచేసి ఒక్క నెలలోనే ఖర్చు చేసిందన్నారు. తమ ప్రభుత్వానికి ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదన్నారు. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా తనకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్