‘శిందే’సిన అసమ్మతి ఎమ్మెల్యేలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్‌ శిందే చేపట్టబోతున్న విషయం తెలియగానే ఆయన వర్గీయులైన ఎమ్మెల్యేలు గోవాలోని హోటల్‌లో ఆనందం పట్టలేక టేబుళ్లపైకెక్కి డ్యాన్స్‌ చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ చేసిన ప్రకటనను టీవీలో వింటూనే

Updated : 01 Jul 2022 06:45 IST

పణజీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్‌ శిందే చేపట్టబోతున్న విషయం తెలియగానే ఆయన వర్గీయులైన ఎమ్మెల్యేలు గోవాలోని హోటల్‌లో ఆనందం పట్టలేక టేబుళ్లపైకెక్కి డ్యాన్స్‌ చేశారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ చేసిన ప్రకటనను టీవీలో వింటూనే వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మరాఠీ పాటలకు అనుగుణంగా అక్కడే స్టెప్పులేశారు. తర్వాత శిందే వారితో వీడియో కాల్‌లో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని