Hyderabad News: కాంగ్రెస్‌ గూటికి బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌

హైదరాబాద్‌ శివారు బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హస్తం గూటికి చేరేందుకు నిర్ణయించారు.  వారిద్దరూ గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో  భేటీ అయ్యారు. 2020 జనవరిలో జరిగిన కార్పొరేషన్‌

Published : 01 Jul 2022 06:46 IST

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, బాలాపూర్‌ : హైదరాబాద్‌ శివారు బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హస్తం గూటికి చేరేందుకు నిర్ణయించారు.  వారిద్దరూ గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో  భేటీ అయ్యారు. 2020 జనవరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా పారిజాత విజయం సాధించారు.  అప్పట్లో పారిజాతకు మేయర్‌ పదవి ఇచ్చేలా ఒప్పందం జరగడంతో ఆమె తెరాసలో చేరారు. మేయర్‌ పదవి దక్కించుకున్నారు. కొంతకాలంగా పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరుల వద్ద వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని