తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరడానికి బేరం పెట్టారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆరోపించారు. పిల్లల చదువుతోపాటు
ఉపముఖ్యమంత్రి రాజన్నదొర
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరడానికి బేరం పెట్టారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆరోపించారు. పిల్లల చదువుతోపాటు రూ.30 కోట్లు, మంత్రి పదవి, అమరావతిలో ఇల్లు ఇస్తామన్నారని.. అయితే తమ నాయకుడు జగన్పై ఉన్న నమ్మకం, అభిమానంతో పార్టీ మారలేదని పేర్కొన్నారు. శుక్రవారం విజయనగరంలో జిల్లా స్థాయి ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తెదేపాలోకి వెళ్లకపోవడం వల్లే తాను ఈ రోజు మంచి పదవిలో ఉన్నానని తెలిపారు. మొదటిసారి మంత్రి పదవి రానందుకు అసంతృప్తి వ్యక్తం చేయలేదని, పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చినా ఒక్కమాట కూడా అనలేదని వివరించారు. పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తల్లో ఏది నిజమో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో తెదేపా హయాంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని, వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.27వేల కోట్లు మాఫీ చేశామని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్