తెదేపాలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి

రాజంపేటకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో

Published : 02 Jul 2022 05:11 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజంపేటకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనపై పోరాటానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండేవారు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా వర్గాల్లో ఉన్న ప్రముఖులు, విద్యావంతులు కూడా తెదేపాలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో రాజంపేట తెదేపా పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును కలిసిన బుల్లితెర నటుడు రాజ్‌కుమార్‌
ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబును బుల్లితెర నటుడు రాజ్‌కుమార్‌ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 2024లో అధికారంలోకి వచ్చేది చంద్రబాబేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని