కేసీఆర్..మీ సంగతి తేల్చేందుకే సమావేశాలు
అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి భాజపా కార్పొరేటర్లకు తెరాస కండువాలు వేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా జాతీయ అధ్యక్షుడికి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఈనాడు-హైదరాబాద్, శంషాబాద్ -న్యూస్టుడే : అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి భాజపా కార్పొరేటర్లకు తెరాస కండువాలు వేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భాజపా జాతీయ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సందర్భంలో, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఎగ్జిబిషన్ను సందర్శించిన అనంతరం బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. 18 రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఉఫ్మని ఊదితే తెరాస ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్లో భాజపా సభ ఎందుకు పెట్టొద్దు? నగరం ఏమైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్లో ఉందా? అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతి తేల్చేందుకే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ‘తెలంగాణకు భాజపా ఏమీ చేయలేదని చెబుతున్న కేసీఆర్, 8 ఏళ్లుగా దేశ ప్రధానిని కలిసి శాలువాలు కప్పి వంగివంగి దండాలు పెట్టారు.. అప్పుడెందుకు అడగలేదు?. ప్రజలంతా భాజపా వైపున్నారని తెలిసి బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారు.నగరంలో ఎక్కడ చూసినా సీఎం, ఆయన కుమారుడి ఫొటోలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. మంత్రులు.. వాళ్ల శాఖకు సంబంధించిన వాటిపైనా ఫొటోలు వేసుకోలేని స్థితిలో ఉన్నారు’ అని ఆక్షేపించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెరాస నాయకులు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని విజయశాంతి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు