మా సభకు సర్కారు ఆటంకాలు.. అయినా విజయవంతం చేస్తాం
తెరాస ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను, ఈ నెల 3న పరేడ్ మైదానంలో బహిరంగసభను విజయవంతం చేస్తామని భాజపా సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా
పరేడ్ మైదానంలో ఏర్పాట్లు పరిశీలించిన కిషన్రెడ్డి, డా.కె.లక్ష్మణ్
ఈనాడు, హైదరాబాద్: తెరాస ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలను, ఈ నెల 3న పరేడ్ మైదానంలో బహిరంగసభను విజయవంతం చేస్తామని భాజపా సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ప్రత్యేక జీవోలు తీసి స్వాగత సన్నాహాలకు ఆస్కారం లేకుండా చేసి.. భాజపా ప్రాధాన్యం తగ్గించేదుకు తెరాస ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోందని దుయ్యపట్టారు. అన్ని వర్గాల సహకారంతో విజయవంతం చేస్తామన్నారు. భాజపా ప్రచారానికి వీలు లేకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసి.. తెరాస ప్రభుత్వ ప్రకటనలను మెట్రో పిల్లర్లతోపాటు.. అన్ని చోట్ల ఏర్పాటు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ