దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టు
ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే.. ఆయనలో తెలంగాణ రక్తం ప్రవహిస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
ఈనాడు- హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే.. ఆయనలో తెలంగాణ రక్తం ప్రవహిస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. తెరాస ప్రభుత్వం వెంటిలేేెటర్పై ఉందని, ఉఫ్ అంటే కూలిపోతుందని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తనతో ఉంటారో లేదో కేసీఆర్ చూసుకోవాలన్నారు. భాజపా కార్యవర్గ సమావేశాల సందర్భంగా శనివారం సాయంత్రం సంజయ్ విలేకరులతో మాట్లాడారు.‘‘ జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు పౌరుషం చూపించినా సీఎంకు కనువిప్పు కలగలేదు. కేసీఆర్ కుటుంబ, నయా నిజాం, రజాకార్ల పాలనను కూకటివేళ్లతో పెకలించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రాన్ని పట్టించుకోకుండా నవభారత్ ఎలా..?
కేసీఆర్కు తెలంగాణ గురించి పట్టింపు లేదుగానీ నవభారత్ నిర్మిస్తారట..? గతంలో అమెరికా ఎన్నికలా? అహ్మదాబాద్ ఎన్నికలా అని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే హైదరాబాద్లో ఫ్లెక్సీలు కట్టి.. ర్యాలీలు నిర్వహించడం చూసి జనం నవ్వుతున్నారు. ఇవి తెలంగాణ ప్రజలు ఓట్లేసే ఎన్నికలా..? లేక సర్పంచి, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలా..? రాష్ట్రంలో మరోసారి గెలవబోమనే ఒత్తిడిలో ముఖ్యమంత్రి ఉన్నారు. ముందు మీ ప్రభుత్వం ఉంటుందో లేదో చూసుకోండి.. తెరాస నేతలే మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటున్నారు. పంజాబ్లో మరణించిన రైతులకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చి.. తెలంగాణ రైతులకు ఎందుకివ్వలేదు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడమే వాళ్లు చేసిన పాపమా?’’ అని సంజయ్ ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?