YSRCP: బస్సు పెట్టాం.. టిఫిన్లున్నాయి.. రావాలి!

‘బస్సు పెట్టాం.. అల్పాహారాలు ఏర్పాటు చేశాం. వైకాపా ప్లీనరీకి ప్రతి గ్రామం నుంచి సుమారు 20 మందికి తగ్గకుండా రావాలి’ అని వాలంటీర్లే ఆహ్వానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా

Updated : 03 Jul 2022 11:40 IST

వైకాపా ప్లీనరీకి వాలంటీర్ల ఆహ్వానం

చాగల్లు, న్యూస్‌టుడే: ‘బస్సు పెట్టాం.. అల్పాహారాలు ఏర్పాటు చేశాం. వైకాపా ప్లీనరీకి ప్రతి గ్రామం నుంచి సుమారు 20 మందికి తగ్గకుండా రావాలి’ అని వాలంటీర్లే ఆహ్వానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైకాపా ప్లీనరీ కొవ్వూరులో ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో చాగల్లు సచివాలయ వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల వారికి వాట్సప్‌లో సందేశాలు పంపారు. సమావేశానికి సొసైటీ ఛైర్మన్లు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నాయకులు వస్తారని, మన ప్రాంతానికి సంబంధించిన వాళ్లు తప్పక రావాలని, వచ్చేముందు తమకు తప్పనిసరిగా చెప్పాలని అందులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని