నామా కనుసన్నల్లోనే నిధుల మళ్లింపు!
రాంచీ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ (ఆర్ఈఎల్) నిధుల మళ్లింపు వ్యవహారంలో మధుకాన్ గ్రూపు ఛైర్మన్, తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పాత్రను ఈడీ గుర్తించింది.
రూ.361.29 కోట్లు తరలించినట్లు గుర్తింపు
రాంచీ ఎక్స్ప్రెస్వే కేసులో ఈడీ దర్యాప్తు
రూ.96.21 కోట్ల మధుకాన్ ఆస్తుల జప్తు
ఈనాడు, హైదరాబాద్: రాంచీ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ (ఆర్ఈఎల్) నిధుల మళ్లింపు వ్యవహారంలో మధుకాన్ గ్రూపు ఛైర్మన్, తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పాత్రను ఈడీ గుర్తించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.361.29 కోట్లను మధుకాన్ సంస్థల్లోకి మళ్లించినట్లు తేల్చింది. ఇందులో రూ.75.5 కోట్లను ఆయన కనుసన్నల్లోనే 6 డొల్ల కంపెనీల్లోకి తరలించినట్లు నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాలతోపాటు పశ్చిమబెంగాల్లో ఆ సంస్థకు చెందిన రూ.88.85 కోట్ల స్థిరాస్తులు, రూ.7.36 కోట్ల చరాస్తులను శనివారం జప్తు చేసింది. హైదరాబాద్లో శనివారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్తో కలిసి నామా పాల్గొన్నారు. అదే సమయంలో ఆస్తుల జప్తు ఉత్తర్వులు వెలువడడం చర్చనీయాంశమైంది.
రూ.1030 కోట్ల నిర్మాణంలో అక్రమాలు..
రాంచీ- జంషెడ్పూర్ మధ్య 163.5 కి.మీ.ల జాతీయ రహదారి నిర్మాణానికి 2011 మార్చి 18న ఎన్హెచ్ఏఐతో మధుకాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రాజెక్టు కోసం కమ్మ శ్రీనివాసరావు, నామా సీతయ్య, నామా పృథ్వీతేజ డైరెక్టర్లుగా ఆర్ఈఎల్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. దీనికి మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) కాంట్రాక్టర్గా వ్యవహరించింది. ఈ పని కోసం కెనరా బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.1030 కోట్ల రుణం మంజూరు చేసింది. గడువు ముగిసినా ప్రాజెక్టు పనులు పూర్తికాకపోగా.. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ప్రకటించాయి. బ్యాంకుల ఫిర్యాదుతో 2019 మార్చి 12న ఆర్ఈఎల్పై రాంచీ సీబీఐ కేసు నమోదు చేసింది. 2020 డిసెంబరు 30న అభియోగపత్రం దాఖలు చేసింది.
90 శాతం నిధులతో 50.24 శాతం పనులే..
సీబీఐ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. 2021 జూన్లో నాగేశ్వరరావుతోపాటు మధుకాన్ సంస్థ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. పలు హార్డ్డిస్క్లు, బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలు సేకరించింది. రాంచీ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ తరఫున ఈపీసీ కాంట్రాక్టర్గా వ్యవహరించిన మధుకాన్ గ్రూప్ ప్రమోటర్లే మొబిలైజేషన్, మెటీరియల్ అడ్వాన్సుల పేరిట రుణాలు తీసుకున్నారని తేల్చింది. ఆ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించినట్లు తెలిపింది. మరోవైపు 90 శాతం నిధులు డ్రా చేసినా 50.24 శాతం పనులే జరిగాయని ఎన్హెచ్ఏఐ, ఫోరెన్సిక్ ఆడిటర్లు తేల్చారు.
ఆరు డొల్ల కంపెనీల సృష్టి
నిధుల మళ్లింపు కోసమే మధుకాన్ గ్రూప్ ప్రమోటర్లు ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, ధర్మశాస్త కన్స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్స్ట్రక్షన్స్, రాగిణి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మి కన్స్ట్రక్షన్స్ పేరిట ఆరు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. వీటి కార్యకలాపాలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య పర్యవేక్షణలోనే జరిగినట్లు పేర్కొంది. రాంచీలో పనులకు.. ఆంధ్ర, తెలంగాణలోని అనుభవం పెద్దగా లేని వారిని సబ్కాంట్రాక్టర్లుగా నియమించడాన్ని బట్టి.. నిధుల మళ్లింపు కోసమే అని నిర్ధారణకు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు