ఓడిపోతే కేసీఆరే టూరిస్ట్‌ అవుతారు

‘వచ్చే ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం కేసీఆర్‌ టూరిస్ట్‌ అవుతారు.అప్పుడు దేశమంతా పర్యటించవచ్చు. హైదరాబాద్‌  వచ్చిన మేము రాజకీయ టూరిస్టులం కాదు.

Published : 03 Jul 2022 05:58 IST

‘వచ్చే ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం కేసీఆర్‌ టూరిస్ట్‌ అవుతారు.అప్పుడు దేశమంతా పర్యటించవచ్చు. హైదరాబాద్‌  వచ్చిన మేము రాజకీయ టూరిస్టులం కాదు. దేశాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ప్రభుత్వం మాది. కేసీఆర్‌ అవినీతిపై ప్రజలు ఫిర్యాదు ఇస్తే కచ్చితంగా సీబీఐ లాంటి ఏజెన్సీలు తమ పని తాము చేస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రంలో వాటిని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. తెలంగాణలో యువతులపై జరుగుతున్న దాడులను చూస్తే ఇక్కడ శాంతిభద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో అవగతమవుతుంది’

- ఇష్టాగోష్ఠిలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని