సీఎం కేసీఆర్‌ ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు

భాజపాకు పెరుగుతున్న ప్రజాదరణతో తెరాస పార్టీ రాజకీయ మైదానంలో జారిపడిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు

Published : 03 Jul 2022 05:58 IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపాకు పెరుగుతున్న ప్రజాదరణతో తెరాస పార్టీ రాజకీయ మైదానంలో జారిపడిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు మద్దతుగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశానికి అత్యంత ఇష్టమైన నాయకుడినుద్దేశించి కేసీఆర్‌ నీచమైన రాజకీయ ప్రసంగం చేశారని, అసభ్యకరమైన భాష వాడారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కావాలనే మరోసారి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి సీఎం, పీఎం వ్యవస్థలను అవమానించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు