దక్షిణాదిలో దూకుడు పెంచాలి
‘దేశంలో మిగతా ప్రాంతాల్లో బలంగా, పటిష్ఠంగా ఉన్న భాజపా దక్షిణాదిలో అలా ఎందుకు ఎదగలేకపోతోందో విశ్లేషించుకోవాలి. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు చేరువకావాలి. అందుకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకుసాగాలి’
తెలంగాణ, కేరళ, ఏపీలపై దృష్టి పెట్టాలి
కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ
ఈనాడు, హైదరాబాద్: ‘దేశంలో మిగతా ప్రాంతాల్లో బలంగా, పటిష్ఠంగా ఉన్న భాజపా దక్షిణాదిలో అలా ఎందుకు ఎదగలేకపోతోందో విశ్లేషించుకోవాలి. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు చేరువకావాలి. అందుకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకుసాగాలి’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో భాజపాకు ఆదరణ లభిస్తోందని..దీన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ, కేరళ సహా ఆంధ్రప్రదేశ్లపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. హైదరాబాద్లో రెండ్రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ముగింపు ప్రసంగం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లి రెండ్రోజుల పాటు అక్కడే ఉండేలా చేసిన కొత్త ప్రయోగాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించాలని..ఈ పద్ధతి పార్టీకి లాభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టినట్లుగానే కేరళలో పార్టీపరంగా వర్క్షాప్లు, భారీ కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. ‘‘అధికారంలో లేకున్నా తెలంగాణ, కేరళ, బెంగాల్లలో పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, నిజాయతీగా పోరాటం చేస్తున్నారు. వారికి అభినందనలు. తెలంగాణలో భాజపా పలుచోట్ల ముందుకు వెళ్లింది. అంతటా ముందుకెళ్లాలి. వారసత్వ పార్టీలకు మనుగడ లేదు. అయితే ఇతర పార్టీలను వెక్కిరించకుండా వాటి లోపాలనుంచి పాఠాలు నేర్చుకోవాలి. మనకు కార్యకర్తలే బలం. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు స్నేహయాత్రలు చేపట్టాలి. జాతీయ నాయకత్వం నుంచి ఏ సహకారం కావాలో చెప్పండి. పెద్ద నాయకులు జిల్లాలు, నియోజకవర్గాలకు వెళ్తే ప్రభావం ఉంటుంది.మైనార్టీల్లో నిర్లక్ష్యానికి గురైన ఓ సామాజికవర్గం సమస్యలపై దృష్టి పెట్టి వారి ఆదరణ పొందడమే ఉత్తర్ప్రదేశ్ ఉపఎన్నికల్లో రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించడానికి కారణం. ఇలా నిర్లక్ష్యానికి గురైనవారు అన్ని రాష్ట్రాల్లో, అన్ని మతాల్లో ఉంటారు. వారిని గుర్తించి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలి.
నిష్ఠతో ఉంటే మంచి ఫలితాలు
ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు కొందరు విమర్శలు చేస్తుంటారు. మనం నిష్ఠగా వ్యవహరించాలి. కొవిడ్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొందరు విమర్శలు చేశారు. కానీ కేంద్రం అనుసరించిన సమగ్ర విధానం ఫలితాన్నిచ్చింది. కరోనాను కట్టడి చేశాం.మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు పదేపదే వివరించాలి’ అని సూచించారు. ‘అభివృద్ధి ఫలాలు దేశంలో ఆఖరి పౌరుడి వరకు అందడమే లక్ష్యంగా ఉండాలి. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేయడం ద్వారా ‘వన్ ఇండియా’ని అందించారు. నాటి చర్య, పటేల్ స్ఫూర్తితో ‘ఒకే దేశం..’ నినాదాన్ని ముందుకు తీసుకెళుతున్నాం..’అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో హైదరాబాద్ను భాగ్యనగరంగా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా