వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తోంది
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల రికార్డు కోసం అడుగులు వేసేట్లుందని భాజపా ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ ఓ
భాజపా నాయకుడు లంకా దినకర్
ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల రికార్డు కోసం అడుగులు వేసేట్లుందని భాజపా ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘‘కేంద్రం, ఆర్బీఐ హెచ్చరికలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పరిమితికి మించి రాష్ట్రం చేసిన అర్హమైన రుణాలను రాబోయే నాలుగేళ్లలో కేంద్రం సర్దుబాటు చేయనుండటం నిజమో, కాదో వీరు చెప్పాలి. కార్పొరేషన్లకు రుణాల అంశంలో ఆర్టికల్ 293(3) నిబంధనల ఉల్లంఘనపై రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖ సారాంశాన్ని బహిర్గతపరచాలి. రుణ పరిమితి విషయంలో స్వయంగా చేసుకున్న చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తుంగలో తొక్కింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వేసిన తప్పుడు గణాంకాలను సవరించి వాస్తవాలు ప్రకటిస్తే అప్పుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది. కేంద్రం పేదలకు ఉచితంగా ఇస్తున్న రూ.అయిదు కిలోల బియ్యాన్ని ప్రజలకు పంచడంలోనూ రాష్ట్రం విఫలమైంది’’ అని లంకా దినకర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..