Revanth Reddy: ‘వెంకట్‌రెడ్డి మా కుటుంబ సభ్యుడు..’

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ కుటుంబ సభ్యుడని, రాజగోపాల్‌రెడ్డి ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ

Updated : 06 Aug 2022 03:35 IST

ఈనాడు, దిల్లీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ కుటుంబ సభ్యుడని, రాజగోపాల్‌రెడ్డి ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ నాయకుడని.. స్టార్‌ క్యాంపెయినర్‌ అని తెలిపారు. ఆయన మునుగోడులో తిరిగి కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ బ్రాండ్‌ లేకపోతే బ్రాందీ షాపులో పనిచేయడానికి కూడా రాజగోపాల్‌రెడ్డి పనికిరారని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి సోదరులను ఇద్దరినీ కలిపి తాను విమర్శించలేదని రేవంత్‌ వివరణ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.  

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌లో చేరారు. తన నేతృత్వంలోని తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆయనతోపాటు ఆ పార్టీ నాయకులు బత్తుల సోమయ్య (ఖమ్మం), సందీప్‌ చమార్‌ (షాద్‌నగర్‌)లు కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని