Sharmila: కొడంగల్‌ నుంచి షర్మిల మలివిడత పాదయాత్ర

వైతెపా అధినేత వైఎస్‌ షర్మిల మలివిడత ప్రజాప్రస్థానం పాదయాత్రను ఈ నెల 8న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ,

Updated : 06 Aug 2022 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైతెపా అధినేత వైఎస్‌ షర్మిల మలివిడత ప్రజాప్రస్థానం పాదయాత్రను ఈ నెల 8న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో యాత్రను పూర్తి చేయగా ఈ దఫా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. కొడంగల్‌ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి యాత్రను ఆమె ప్రారంభిస్తారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాదయాత్ర సమన్వయకర్త వాడుక రాజగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని