ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం
‘‘ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా వాడేస్తోంది. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఈ చట్టం కింద కేసులు పెట్టి వేధిస్తోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు
ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ ధ్వజం
ఈనాడు, అమరావతి: ‘‘ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా వాడేస్తోంది. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఈ చట్టం కింద కేసులు పెట్టి వేధిస్తోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లిలో జశ్వంత్ అనే యువకుడితో పాటు మరో 9 మంది జనసేన సైనికులపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ములు రావడం లేదని జశ్వంత్ గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను ప్రశ్నించడమే ఇందుకు కారణం. అతనికి మద్దతు ఇవ్వడమే మిగిలిన వారు చేసిన నేరం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాప్రతినిధులను ప్రశ్నించినంత మాత్రాన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తామంటే ఎలా? అని పవన్కల్యాణ్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యేను నిలదీసిన వీరమహిళలకు సత్కారం
ప్రభుత్వ దాష్టీకాలపై మహిళలు ధైర్యంగా పోరాడాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా జి.పెదపూడిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా..వరద బాధితుల సమస్యలు చెప్పేందుకు వీరమహిళలు ప్రయత్నిస్తే ఓ ఎమ్మెల్యే దుర్భాషలాడారని తెలిపారు. ఆ అధికారపార్టీ ఎమ్మెల్యేను ధైర్యంగా నిలదీసిన వీరమహిళలను హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన శాలువా కప్పి సత్కరించారు. గంటా స్వరూప, ఎమ్.ప్రియా సౌజన్య, చల్లా లక్ష్మి, కె.నాగమానస, సుంకర కృష్ణవేణి, మేడిశెట్టి సత్యవాణి, బోడపాటి రాజేశ్వరి, బర్రె లక్ష్మి, మోటూరి కనకదుర్గలను ఆయన సన్మానించారు. సమస్యలపై పోరాడే వీరమహిళలకు పార్టీ అండగా ఉంటుందని పవన్కల్యాణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు