ఎంపీగా గెలిపించింది.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడానికా ?
గోరంట్ల మాధవ్ను ప్రజలు ఎంపీగా గెలిపించింది.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడానికా అని తెదేపా అధికార ప్రతినిధి కావలి గ్రీష్మా ప్రశ్నించారు. వైకాపా ప్రజాప్రతినిధులు
తెదేపా అధికార ప్రతినిధి కావలి గ్రీష్మా
ఈనాడు డిజిటల్, అమరావతి : గోరంట్ల మాధవ్ను ప్రజలు ఎంపీగా గెలిపించింది.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడానికా అని తెదేపా అధికార ప్రతినిధి కావలి గ్రీష్మా ప్రశ్నించారు. వైకాపా ప్రజాప్రతినిధులు మహిళలతో ఈ విధంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.‘‘ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంతో రాష్ట్రం పరువు, ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయి. వైకాపా ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలను తయారు చేస్తోంది. సీఎం జగన్ నేరస్థుడు కాబట్టే ఆ పార్టీ వాళ్లు ఇలా ఉన్నారు. తక్షణం గోరంట్ల మాధవ్తో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి. ఆయన్ను వైకాపా నుంచి సస్పెండ్ చేయాలి. దీనిపై తెదేపా తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!