నేడు గవర్నర్‌ను కలవనున్న షర్మిల

వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌ తమిళిసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని

Published : 08 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌ తమిళిసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయనున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని భావించినప్పటికీ గవర్నర్‌ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని