రాజకీయాల్లోకి హిందుత్వాన్ని లాగొద్దు
భైంసా అల్లర్లపై స్పందించని ముఖ్యమంత్రి కేసీఆర్కు దిల్లీ, మధ్యప్రదేశ్లలో జరిగిన విషయాలు చాలా బాగా గుర్తున్నాయని విశ్వహిందూ పరిషత్ నేతలు ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే
కేసీఆర్కు వీహెచ్పీ హితవు
ఈనాడు, హైదరాబాద్: భైంసా అల్లర్లపై స్పందించని ముఖ్యమంత్రి కేసీఆర్కు దిల్లీ, మధ్యప్రదేశ్లలో జరిగిన విషయాలు చాలా బాగా గుర్తున్నాయని విశ్వహిందూ పరిషత్ నేతలు ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులు ఎంతటి వారైనా ఢీకొనేందుకు వీహెచ్పీ సిద్ధంగా ఉందన్నారు. హనుమాన్ జయంతి రోజున దిల్లీలో.. శ్రీరామనవమి రోజున మధ్యప్రదేశ్లో ఏం జరిగిందో ఆయన ముందుగా తెలుసుకోవాలన్నారు. ఈ మేరకు ఆదివారం వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, సహ కార్యదర్శి రాజేశ్వర్రెడ్డి, భజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని... రాజకీయాల్లోకి హిందుత్వాన్ని లాగవద్దని వారు కేసీఆర్కు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!