రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి భాజపాదే
రాష్ట్ర రాజకీయాల్లో భాజపా నిర్ణయాత్మక శక్తిగా మారిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భాజపా చేపట్టే ఉద్యమాలకు ప్రజల
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో భాజపా నిర్ణయాత్మక శక్తిగా మారిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భాజపా చేపట్టే ఉద్యమాలకు ప్రజల మద్దతుండటంతో పాటు పలు సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. భాజపా ముఖ్యనేతలతో ఆయన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యాత్రకు పలు జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ఉత్సాహాన్ని కార్యకర్తలు కొనసాగించాలి. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కంటే భాజపాకే ఆదరణ ఎక్కువ ఉంది. ప్రజాసమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాలు కొనసాగిస్తాం’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!