మహారాష్ట్ర హోంమంత్రిగా ఫడణవీస్‌!

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వారంలోపు తన మంత్రిమండలిని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. 15 మందిని ఆయన మంత్రులుగా తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడణవీస్‌ హోంశాఖ పగ్గాలు

Published : 08 Aug 2022 06:22 IST

ఆగస్టు 15లోపు మంత్రిమండలి విస్తరించే అవకాశం

దిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వారంలోపు తన మంత్రిమండలిని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. 15 మందిని ఆయన మంత్రులుగా తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడణవీస్‌ హోంశాఖ పగ్గాలు చేపట్టనున్నారని తెలుస్తోంది. మంత్రిమండలిపై కసరత్తు ఈ నెల 15లోపు కొలిక్కిరానుంది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్‌ఠాక్రే రాజీనామా చేయడంతో జూన్‌ 30న శిందే, ఫడణవీస్‌లు మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరితోనే మహారాష్ట్ర మంత్రిమండలి కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని