వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలు, అనుబంధ కులాలకు న్యాయం జరుగుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి (ఎమ్మార్పీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు తెన్నేటి కిశోర్ మాదిగ అన్నారు. వర్గీకరణ కోరుతూ తెలుగు
ఎమ్మార్పీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు తెన్నేటి కిశోర్ మాదిగ
ఈనాడు, దిల్లీ: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలు, అనుబంధ కులాలకు న్యాయం జరుగుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి (ఎమ్మార్పీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు తెన్నేటి కిశోర్ మాదిగ అన్నారు. వర్గీకరణ కోరుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన మాదిగ సంఘాల ఆధ్వర్యంలో దిల్లీ జంతర్ మంతర్లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర్ మాదిగ మాట్లాడుతూ ప్రధాని మోదీ మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల హక్కులపై భాజపాకు చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. మాదిగల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించకుండా, రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై అధిష్ఠానానికి నివేదికలు ఇవ్వకుండా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ముడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేయడం సిగ్గుచేటని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి మండిపడ్డారు. ధర్నాలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇటుక రాజు, దండు వీరయ్య, ధరూర్ నరేశ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేయొద్దు
కిషన్రెడ్డికి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వినతి
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా చూడాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని సమితి నాయకులు సోమవారం దిల్లీలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎస్సీ వర్గీకరణ కాలం చెల్లిన డిమాండ్ అని తెలిపారు. తేనె తుట్టెలాంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని వారు కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో సమితి ఛైర్మన్ చెన్నయ్య, నాయకులు కరణం కిషన్, పిల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్