బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

బీసీసంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులాపురం. దిల్లీ కాన్‌స్టిట్యూషన్‌

Published : 09 Aug 2022 04:54 IST

ఈనాడు, దిల్లీ: బీసీసంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికయ్యారు. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులాపురం. దిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో శ్రీనివాస్‌గౌడ్‌ను అధ్యక్షుడిగా, కుమ్మరి క్రాంతికుమార్‌ యాదవ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా బీసీలు జనాభా దామాషా పద్ధతిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను దక్కించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై పాలకులను యాచించకుండా రాజకీయాలను శాసించి, మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం దక్కేలా ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్రావు, నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్‌, నాగమల్లేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని