హడావుడి.. ఆర్భాటాలు వద్దు
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖరారు కావడంతో అక్కడ ఎన్నికలకు సన్నద్ధం కావాలని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు నిర్దేశించారని తెలిసింది.
మునుగోడుపై ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
ఈనాడు, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖరారు కావడంతో అక్కడ ఎన్నికలకు సన్నద్ధం కావాలని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు నిర్దేశించారని తెలిసింది. సోమవారం హైదరాబాద్లో స్వతంత్రభారత వజ్రోత్సవాల ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘‘మునుగోడు ఎన్నికపై అనవసరంగా హైరానా పడొద్దు. ప్రత్యర్థులు అయోమయంలో ఉన్నారు. వారి పథకం వికటిస్తుంది. వారు వేసిన ఉచ్చులో వారే పడి కొట్టుకుంటున్నారు. మన పని మనం తాపీగా చేసుకుంటూ వెళదాం. రెండు, మూడు రోజుల్లో సమావేశం పెట్టి వ్యూహంపై కార్యాచరణ అమలు చేద్దాం’’ అని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. మునుగోడులో పార్టీ సర్వేల ప్రాథమిక వివరాలను సీఎం నేతలకు వివరించారు. సమగ్ర సమాచారంతో పాటు నేతల వివరాలను తీసుకొని రావాలని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఇన్ఛార్జి నియామకంపైనా చర్చ జరిగిందని తెలిసింది. ఇన్ఛార్జిగా మంత్రి కేటీఆర్ను నియమించాలని కొందరు నేతలు సీఎంను కోరారు. జిల్లా నేతలు గానీ, జిల్లాతో అనుబంధం ఉన్న నేతలను నియమించే అంశాన్ని సైతం తెరాస అధిష్ఠానం పరిశీలన ఉన్నట్లు తెలిసింది.
చకాచకా మార్పులు
రాజగోపాల్రెడ్డి రాజీనామా అనంతరం పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలు జరిగే జిల్లాలో పూర్తిస్థాయి కలెక్టర్ ఉండాలి. ఈ మేరకు కొత్త కలెక్టర్పై ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న అధికారులను కూడా బదిలీ చేసే వీలుంది. రాజగోపాల్రెడ్డి రాజీనామాతో గత కొంతకాలంగా ఉన్న ప్రొటోకాల్ సమస్యలు తొలగిపోయాయని, వెంటనే నియోజకవర్గంలో ఆస్తుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని పార్టీ నేతలు కోరగా... దానికేం తొందరపడవద్దని సీఎం సూచించినట్లు తెలుస్తోంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్