ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా భాజపా రాష్ట్ర శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో అమెరికాలోని ప్రవాసాంధ్రులు కూడా భాగస్వాములు కావాలని అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. అమెరికాలోని తెలుగు వారితో వీడియో

Updated : 09 Aug 2022 05:48 IST

సోము వీర్రాజు విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా భాజపా రాష్ట్ర శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో అమెరికాలోని ప్రవాసాంధ్రులు కూడా భాగస్వాములు కావాలని అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. అమెరికాలోని తెలుగు వారితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమువీర్రాజు, ఇతర సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలవల్ల ప్రజలకు ఎదురవుతోన్న సమస్యలు, కేంద్ర నిధులతో ఏపీలో దేవాలయాలు, ఇతర రంగాల్లో జరుగుతోన్న అభివృద్ధి గురించి వివరించారు. దేవాలయాల పరిరక్షణ కోసం భాజపా రాష్ట్ర శాఖ కృషిచేస్తోందని పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని