‘మాధవ్‌ను కాపాడే ప్రయత్నం సిగ్గుచేటు’

ఎంపీ మాధవ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విమర్శించారు.

Published : 10 Aug 2022 05:41 IST

ఈనాడు, అమరావతి: ఎంపీ మాధవ్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విమర్శించారు. సజ్జలకు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘గోరంట్ల మాధవ్‌ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు ప్రజల పరువు పోయింది. అశ్లీల వీడియోపై విచారణ చేస్తాం అంటున్నారు. ఎన్ని రోజులు కావాలో చెప్పండి. సినీ నటుడు పృథ్వీని ఏ విచారణతో తొలగించారు?  గోరంట్లను తొలగించాలని డిమాండు చేస్తున్న వారికి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. నాకూ ఫోన్లు వస్తున్నాయి. కట్టుకథలు మాని, మాధవ్‌పై చర్యలు తీసుకోండి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని