BJP: తెలంగాణ భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్
భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. ఉత్తర్ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత) ఉన్న ఆయనను బుధవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ వెంటనే తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్,
ఈనాడు, హైదరాబాద్ : భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితులయ్యారు. ఉత్తర్ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత) ఉన్న ఆయనను బుధవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ వెంటనే తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు అప్పగించారు. బన్సల్ నియామకానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆమోద ముద్ర వేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ తెలిపారు. అయితే భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇప్పటివరకు ఉన్న తరుణ్ఛుగ్ స్థానంలోనా.. కాదా అనే అంశంపై స్పష్టత లేదు.పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు కూడా దీనిపై పూర్తిగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు 12వ తేదీన తాను రాష్ట్రానికి వస్తున్నట్లు తరుణ్ఛుగ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రేమేందర్రెడ్డితో చెప్పినట్లు సమాచారం. దీంతో ఛుగ్ను రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగిస్తారని, బన్సల్ను సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించారని పార్టీ నేతలు కొందరు అంటున్నారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సునీల్ బన్సల్ ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రచారక్గా ఏబీవీపీలో జాతీయస్థాయి బాధ్యతల్లో ఉన్న ఆయనను అమిత్షా ఉత్తర్ప్రదేశ్కు తీసుకువచ్చారు. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బన్సల్ 2014, 2019 లోక్సభ ఎన్నికలు... 2017, 2022 శాసనసభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో పార్టీ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. తెలంగాణతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశాలపై భాజపా కొంతకాలంగా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించిందని పార్టీ వర్గాలంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్