రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడింది
ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ బాగుండాలని, రాష్ట్రంలో అది పూర్తిగా కుంటుపడిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విద్యార్థి జన సమితి ముఖ్య నాయకుల
తెజస అధ్యక్షుడు కోదండరాం
ఈనాడు, హైదరాబాద్: ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ బాగుండాలని, రాష్ట్రంలో అది పూర్తిగా కుంటుపడిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విద్యార్థి జన సమితి ముఖ్య నాయకుల విస్త్రతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు ఇవ్వకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో వసతులు ఏమాత్రం బాగోలేవని, విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో మేనేజ్మెంట్ విధానాన్ని ఎత్తివేయాలని, అన్ని సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, కార్పొరేట్ కళాశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలను ఆమోదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య